English | Telugu
ఇకపై మారనున్న బ్యాంక్ పనివేళలు
Updated : Oct 1, 2019
బ్యాంక్ పనివేళల సమయాన్ని పెంచుతూ ఆర్ బీఐ నిర్ణయం తీసుకుంది. అలాగే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్ మెంట్ ద్వారా ఎంతయినా లావాదేవీలు జరుపుకోవచ్చు. కమిషన్ కూడా తగ్గిస్తూ వ్యాపార వర్గాలకు ఆర్ బీఐ శుభవార్త చెప్పింది. అక్టోబరు ఒకటి మంగళవారం నుండి ప్రభుత్వ రంగ బ్యాంకులు పని వేళల్లో మార్పులు జరగనున్నాయి. స్థానిక ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా రిజర్వు బ్యాంకు సూచించిన మూడు రకాల పనివేళల్లో ఒకటి ఎంపిక చేసుకొనే అమలు చేస్తారు. దేశం లోని నాలుగు జిల్లాల్లో ఖాతాదారుడు బ్యాంకు సేవలను మరింత చేరువ చేసేందుకు అక్టోబరు మూడు నుంచి ఏడు దాకా ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపట్టామని రాష్ట్ర బ్యాంకర్ల సమితి కన్వీనర్ కెవి నాంచారయ్య తెలిపారు. విజయవాడ లోని ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ మణిమాల, ఎస్ బీఐ ఏజీఎం డీజే ప్రసాద్ ,ఆంధ్రా బ్యాంక్ డీజీఎం వెంకటేశ్వర స్వామి, ఎస్ ఎల్ బిసి ఏజీఎం కె అజయ్ పాల్ తదితరులు విలేకరులతో మాట్లాడారు భారత బ్యాంకర్ల సంఘం సూచనల మేరకు మూడు రకాల పనివేళలు రూపొందించారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఐదు గంటల వరకు పనిచేయనున్నాయని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యం లోని జిల్లా స్థాయి సంప్రదింపుల సమితి లో చర్చించి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి కి పంపిస్తారు. వారి ఆమోదంతో ఈ పనివేళలు అమలు చేస్తారు. అకౌంట్ హోల్డర్ లు సివిల్స్ స్కోర్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ఇందులో రైతులకు కూడా మినహాయింపు లేదు. ప్రకృతి వైపరీత్యాలు రుణాల రీషెడ్యూల్ బట్టి అంశాలను పరిగణలోనికి తీసుకుని స్థానిక బ్యాంకు మేనేజర్ లు సానుకూల నిర్ణయం తీసుకుంటారు.