English | Telugu
యూపీలో తీవ్ర కలకలం.. కుప్పలు తెప్పలుగా చచ్చిపడిన గబ్బిలాలు
Updated : May 27, 2020
ఈసమచారం వెటర్నరీ అధికారులకు తెలియటంతో, వారు సైతం హుటాహుటిన ఆ స్థలానికి చేరుకుని వాటిని పరిశీలించారు. గబ్బిలాలు చనిపోవటానికి కరోనా వైరస్ కారణం కాదని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఎండలు సగటుతో పోలిస్తే, చాలా ఎక్కువగా వున్న కారణంగానే గబ్బిలాలు చనిపోయాయని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు డివిజనల్ ఫారెస్ట్ హెడ్ అవినాష్ కుమార్ వెల్లడించారు. ఉష్ణోగ్రత 46 డిగ్రీల వరకూ ఉందని, తాగేందుకు నీరు లేకనే అవి చనిపోయి వుండవచ్చని తెలిపారు. స్థానికులు ఏమాత్రం భయపడాల్సిన పనిలేదని సూచించారు. చనిపోయిన గబ్బిలాలను తదుపరి పరీక్షల నిమిత్తం వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కు పంపించామని తెలియజేశారు.