English | Telugu

ఎమ్మార్వోను హత్య చేసిన నిందితుడు సురేష్ మృతి

అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి తన ఆఫీస్ లోనే అగ్నికి ఆహుతి అయిన సంగతి తెలిసిందే. అయితే ఆమెను హత్య చేసిన నిందితుడు సురేష్ కూడా ఈరోజు మృతి చెందాడు. తహసీల్దార్ విజయారెడ్డి పై పెట్రోల్ పోసి తగులబెట్టిన ఘటనలో అతడు కూడా తీవ్ర గాయాలపాలయ్యాడు. సురేష్ 65 శాతం కాలిన గాయాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చేరగా చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించి అతడు మృతి చెందాడు. ముఖం, ఛాతీ కాలిపోవటంతో అతడు చికిత్సకు స్పందించలేదని సమాచారం. కాసేపట్లో అతడి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించనున్నారు.