English | Telugu

ఏ మనిషి కూడా పస్తు ఉండే పరిస్థితి రాకూడదు!

ఏప్రిల్‌ 16 నుంచి రేషన్‌ పంపిణీ సందర్భంగా తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై ఉన్న‌తాధికారుల‌తో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వీడియోకాన్ఫ‌రెన్స్‌లో చ‌ర్చించారు. ఒకే దుకాణం పరిధిలో రెండు మూడు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రజలు గుమిగూడకుండా ముందే టోకెన్లు ఇస్తున్నారు. ఎవరు ఏ రోజు రేషన్‌కోసం రావాలో, ఏ కౌంటర్‌ వద్దకు రావాలో స్లిప్పులో పేర్కొంటున్నారు. ఎవరికి కార్డు లేకపోయినా అర్హతలు గ్రామ, వార్డు సచివాలయాల్లో పెట్టామ‌ని అధికారులు ముఖ్య‌మంత్రికి వివ‌రించారు.

ఇలాంటి సమయంలో ఆహారంలేని పరిస్థితి ఉండకూడదు కాబట్టి.. ఎవరు రేషన్‌ అడిగినా ఇవ్వండి. ఏ మనిషి కూడా పస్తు ఉండే పరిస్థితి రాకూడదని ముఖ్య‌మంత్రి సూచించారు. గతంలో ప్రకటించిన విధంగా కరోనా సహాయం కింద రేషన్‌ తీసుకున్న ప్రతి ఒక్కరికీ కూడా రూ.1000లు ఇవ్వండని సి.ఎం. ఆదేశించారు.