English | Telugu

ఒంగోలులో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌

ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోన్న నేపథ్యంలో నగరంలో పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు కలెక్టర్‌ భాస్కర్‌ ప్రకటించారు. ఈ నెల 21 నుంచి 14 రోజులపాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని, ఎలాంటి సడలింపులు ఉండవని తెలిపారు.

ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకు 267 కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఇటీవల కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిన్న కొత్తగా 8 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒంగోలులో ఒక్కసారిగా కరోనా పాజిటివ్‌ కేసులు రావడం, కరోనా అనుమానితులు వందల సంఖ్యలో ఉండటంతో పరిస్థితి చేయిదాటిపోయేలా ఉంది. దీంతో అప్రమత్తమైన జిల్లా అధికారులు నగరంలో కరోనా వ్యాప్తిని నిలువరించడానికి పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటించారు.