Read more!

English | Telugu

నయనతార స్థానంలో రాధిక

 

"లెజెండ్" సినిమాలో బాలకృష్ణతో కలిసి నటించిన రాధికా ఆప్టేకు ప్రస్తుతం అవకాశాలు బాగానే వస్తున్నాయి. తాజాగా వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించనున్న "ఓ మై గాడ్" చిత్ర రీమేక్ లో వెంకటేష్ కు జోడిగా రాధికను ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. ముందుగా ఈ పాత్ర కోసం నయనతారను అనుకున్నారు. కానీ రెమ్యునరేషన్ విషయంలో మనస్పర్ధలు రావడంతో ఈ ప్రాజెక్టు నుండి నయనతార తప్పుకుంది. దాంతో ఆ ఛాన్స్ రాధికకి దక్కింది. ఈ చిత్రంలో కృష్ణుడి పాత్రలో పవన్ కళ్యాణ్ నటించనున్నాడు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మాత సురేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి డాలీ దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం "దృశ్యం" షూటింగ్ లో వెంకటేష్ బిజీగా ఉన్నాడు. ఇందులో వెంకీ సరసన మీనా జోడి కట్టింది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.