English | Telugu
'విక్రమ్ వేద' హిందీ రీమేక్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి!
Updated : Dec 6, 2021
కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'విక్రమ్ వేద' బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన నటిస్తున్నారు. విక్రమ్వేద ఒరిజినల్ సినిమా కథ రాసి దర్శకత్వం వహించిన పుష్కర్, గాయత్రి.. ఇప్పుడు హిందీ రీమేక్నూ డైరక్ట్ చేస్తున్నారు.
విక్రమ్ వేద హిందీ రీమేక్ 27 రోజుల ఫస్ట్ షెడ్యూల్ని అబుదాబిలో విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ లో హృతిక్ రోషన్ పాల్గొన్నారు. లక్నోలో జరిగే సెకండ్ షెడ్యూల్లో సైఫ్ అలీఖాన్ పార్టిసిపేట్ చేస్తారు. పుష్కర్, గాయత్రి మాట్లాడుతూ "గొప్ప స్టార్లు హృతిక్, సైఫ్తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. అద్భుతమైన టీమ్తో కలిసి పనిచేస్తున్నాం. అత్యంత ఇంటెన్స్ , ఎగ్జయిటింగ్ ప్రాజెక్ట్ ను డెలివరీ చేస్తామనే నమ్మకం ఉంది" అని అన్నారు. నిర్మాత ఎస్.శశికాంత్ మాట్లాడుతూ ``నాలుగేళ్ల క్రితం తమిళ్లో విడుదలైన విక్రమ్ వేద సబ్జెక్ట్ ని, ఇప్పుడు హిందీలో ఇంకా అద్భుతంగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. హృతిక్, సైఫ్ కలిసి ఈ కథను బౌండరీలు దాటించి ప్రపంచానికి పరిచయం చేయడానికి కృషి చేస్తున్నారు`` అని అన్నారు.
టీసీరీస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, ఫ్రైడే ఫిల్మ్ వర్క్స్ సమర్పిస్తున్న విక్రమ్ వేద సినిమాను వైనాట్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్.శశికాంత్ నిర్మిస్తున్నారు. 2022 సెప్టెంబర్ 30న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.