English | Telugu
కత్రినా-విక్కీ వెడ్డింగ్ ఫుటేజ్కు రూ. 100 కోట్ల ఆఫర్ చేసిన ఓటీటీ దిగ్గజం!
Updated : Dec 6, 2021
ఈ మిలీనియంలో హిందీ చిత్రసీమలో అడుగుపెట్టిన వారిలో నిస్సందేహంగా కత్రినా కైఫ్ అత్యంత ప్రజాదరణ పొందిన తారల్లో ఒకరు. ఆమె ఫ్యాన్ బేస్ దేశంలోని మారుమూల ప్రాంతాలకూ విస్తరించింది. రాజస్థాన్లో సహనటుడు విక్కీ కౌశల్ను కుటుంసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకోవడానికి ఆమె రెడీ అవుతోంది. రెండు నెలలుగా వారి పెళ్లి గురించిన ప్రచారం నడుస్తూ వస్తోంది. ఎట్టకేలకు ఆ జంట ఈ నెల 9న ఒక్కటవుతున్నారు.
Also read: డిసెంబర్ 9న కత్రినా-విక్కీ పెళ్లి.. ఫస్ట్ గెస్ట్ ఎవరో తెలిసింది!
కాగా వారి వివాహ వేడుక వీడియో ఫుటేజ్ను ఎక్స్క్లూజివ్గా తమ ప్లాట్ఫామ్పై స్ట్రీమింగ్ చేయడానికి ఒక ఓటీటీ దిగ్గజం కత్రినా-విక్కీ జంటకు ఏకంగా రూ. 100 కోట్లను ఆఫర్ చేసిందనే విషయం బయటకు పొక్కింది. "పాశ్చాత్య దేశాల్లో సెలబ్రిటీలు తమ వివాహ వేడుకకు సంబంధించిన ఫుటేజ్లు, ఫొటోలను పత్రికలకు, చానళ్లకు అమ్మడం ఒక సాధారణ ధోరణి. ఎందుకంటే తమ ఆరాధ్య తారల జీవితానికి సంబంధించిన అత్యంత కీలక ఘట్టాన్ని చూడాలని కోరుకునే ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. అదే ధోరణిని మనదేశంలో కూడా తీసుకురావాలని సదరు ఓటీటీ దిగ్గజం భావిస్తోంది. అందులో భాగంగా కత్రినా, విక్కీల పెళ్లి ఫుటేజ్కు రూ. 100 కోట్లు ఆఫర్ చేసింది" అని వారి సన్నిహిత వర్గాలు తెలిపాయి.
Also read: సోషల్ మీడియా అకౌంట్ల నుంచి భర్త పేరు తీసేసిన ప్రియాంక.. డివోర్స్ రూమర్స్!
ఈ ఆఫర్కు వారు ఒప్పుకుంటే, వెడ్డింగ్ ఫంక్షన్కు చెందిన అన్ని ఘట్టాలను తమ ప్లాట్ఫామ్పై ఫీచర్ ఫిల్మ్గా తీసి, ఎడిట్ చేసి, దాన్ని స్ట్రీమింగ్ చేస్తారు. "ఆ ఫుటేజ్లో లైవ్ మూమెంట్స్, కటుంబసభ్యుల, అతిథులు, మేకప్ ఆర్టిస్టుల, స్టైలిస్టుల.. ఇట్లా పలువురి ప్రత్యేక ఇంటర్వ్యూలు ఉంటాయి. దీనిపై కత్రినా, విక్కీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వారు ఈ ఆఫర్ను వదులుకునే అవకాశం ఎంతుందో, తమ వివాహ వేడుకను ఫ్యాన్స్ చూసి ఆనందించేందుకు అనుగుణంగా ఆ ఓటీటీ దిగ్గజంతో ఒప్పందం కుదుర్చుకోవడానికి అంత అవకాశం ఉంది" అని ఆ వర్గాలు చెప్పాయి.