Read more!

English | Telugu

నా సినిమాలు చూసి నా భార్య నా కూతురు నన్నే జండు బామ్ ఉందా అని అడుగుతారు

90 వ దశకంలో బాలీవుడ్ లో వచ్చిన ఎన్నో యాక్షన్ సినిమాల్లో హీరోగా చేసి  తనకంటు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్  బేస్ ని ఏర్పాటు చేసుకున్న నటుడు సునీల్ శెట్టి. మొహ్రా ,గోపి కిషన్, రక్షక్ ,భాయ్ వంటి భారీ యాక్షన్ చిత్రాలు ఆయనకి ఎంతగానో పేరు తెచ్చిపెట్టాయి. అలాగే ఎలాంటి ఇగోలకి పోకుండా వేరే హీరోలతో మల్టీ స్టారర్ సినిమాల్లో కూడా నటించాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో ఆయన చేసిన వ్యాక్యలు చర్చినీయాంశ మయ్యాయి.


సునీల్ శెట్టి మాట్లాడుతు నేను నటించిన సినిమాలని మా ఇంట్లో వాళ్ళతో కలిసి చూస్తాను.నా తల్లి తండ్రులు, నా భార్య నా కూతురికి నేనే దగ్గరుండి మరి నా సినిమాలు చూపిస్తాను. ఆ తర్వాత సినిమా ఎలా ఉంది అని వాళ్ళందర్నీ అడుగుతాను. అప్పుడు వాళ్ళు సినిమా బాగానే ఉంది అంటారు. కానీ నీ దగ్గర జండు బామ్ ఏమైనాఉందా అని అడుగుతారు.అప్పుడు ఆ ఒక్క మాటతో  నాకు అర్ధం అయ్యేది  వీళ్ళకి నా సినిమాలు తలనొప్పిగా ఉంటున్నాయని అని సునీల్ శెట్టి చెప్పుకొచ్చాడు.
ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

సునీల్ జట్టు తెలుగులో కూడా మంచు విష్ణు హీరో గా వచ్చిన మోసగాళ్లు ,అలాగే వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గని లాంటి  చిత్రాల్లో నటించాడు. కాగా ప్రముఖ ఇండియన్ క్రికెటర్ కేఎల్ రాహుల్ మీద సోషల్ మీడియాలో  వచ్చే ట్రోల్స్ కి  తాను చాలా  బాధపడతానని కూడా సునీల్ శెట్టి తెలిపాడు. కేఎల్ రాహుల్ సునీల్ శెట్టి కూతుర్ని పెళ్లిచేసుకున్నాడనే విషయం అందరికి తెలిసిందే.