Read more!

English | Telugu

తెల్లవారుజామున అమ్మవారి గుడిలో పూజలు చేసిన షారుక్ ఖాన్!

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన తాజా చిత్రం డంకీ..ఇండియన్ సినిమా గర్వించదగ్గ గొప్ప దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ మూవీ ఈ నెల 21 న విడుదల అవుతుంది. ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్ కూడా సినిమా మీద అందరిలో అంచనాలని పెంచేసింది. ఇంకో వారంలో మూవీ రిలీజ్ ఉండటంతో షారుక్ ఒక టెంపుల్ కి వెళ్లడం ఇప్ప్పుడు ప్రాధాన్యతని సంతరించుకుంది.

షారుఖ్ ఈ రోజు తెల్ల వారుజామున జమ్మూ కాశ్మీర్లో ఉన్న వైష్ణోదేవి ఆలయానికి వెళ్ళాడు. గుడి చుట్టూ ప్రదక్షిణలని చేసిన షారుఖ్ ఆ తర్వాత వైష్ణో దేవి అమ్మవారిని దర్శనం చేసుకున్నాడు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధ ప్రసాదాలని స్వీకరించాడు.కాగా షారుక్ వైష్ణో దేవి అమ్మవారిని  దర్శించుకోవడం ఇది మూడోసారి. తన గత చిత్రాలైన పఠాన్, జవాన్ మూవీల విడుదల సమయంలో  కూడా షారుక్ వైష్ణోదేవి అమ్మవారిని దర్శనం చేసుకొని పూజలు నిర్వహించాడు.ఆ రెండు చిత్రాలు కూడా ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులని సృష్టించాయి. దాంతో షారుక్ కి వైష్ణోదేవి అమ్మవారంటే చాలా భక్తి  ఏర్పడటంతో పాటుగా అమ్మవారిని దర్శనం చేసుకోవడం సెంటిమెట్ గా కూడా మారింది.

ఇప్పుడు కూడా డంకీ విడుదల సమయంలో షారుఖ్ అమ్మవారిని దర్శనం చేసుకొని తన సినిమా ఘన విజయం సాధించాలని వేడుకున్నాడు. ఇప్పుడు ఈ  ఫోటోలు  సోషల్ మీడియాలో వైరల్  అవుతున్నాయి. అలాగే షారుక్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా జవాన్ అప్పుడు దర్శనం చేసుకున్నారు. విదేశాల నుంచి జన్మభూమికి తిరిగొచ్చే క్యారక్టర్ లో నటిస్తున్న షారుఖ్  డంకీతో మళ్ళీ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి. తాప్సి పన్ను ,బొమన్ ఇరానీ, విక్కీ కౌశల్ ,విక్కీ కౌచర్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.