English | Telugu
"మెంటల్ హెరాస్మెంట్కు రూ. 75 కోట్లు చెల్లించండి".. రాజ్-శిల్పాకు షెర్లీన్ నోటీస్!
Updated : Oct 30, 2021
కొద్ది నెలలుగా శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా వార్తల్లో వ్యక్తులుగా మారారు. పోర్న్ మూవీస్ నిర్మించి, వాటిని మొబైల్ యాప్స్లో అప్లోడ్ చేస్తున్నారంటూ రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల అతను బెయిల్పై బయటకు వచ్చాడు. అంతకుముందు ఈ ఏడాది ఏప్రిల్లో రాజ్ కుంద్రా తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ నటి షెర్లీన్ చోప్రా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కుంద్రా కంపెనీ ఆర్మ్స్ప్రైమ్ చేసే పనుల గురించి ఆమె బయటపెట్టింది. ఇది కుంద్రా అరెస్ట్కు దారి తీసింది.
ఆ తర్వాత కూడా రాజ్ కుంద్రా గురించి కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడిస్తూ వచ్చింది షెర్లీన్. అతనితో పాటు శిల్పాశెట్టిపైనా ఆమె ఆరోపణలు చేసింది. ఇటీవల అక్టోబర్ 14న రాజ్పై జుహు పోలీస్ స్టేషన్లో లైంగిక వేధింపుల కేసు పెట్టిందామె. రాజ్, శిల్పా ఇద్దరూ తనపై కుట్రలు చేస్తున్నారనీ, మానసికంగా వేధిస్తున్నారనీ ఆమె ఆ ఫిర్యాదులో ఆరోపించింది.
దీంతో షెర్లీన్పై రూ. 50 కోట్లకు పరువునష్టం దావా వేశారు రాజ్, శిల్పా. వాళ్ల చర్యకు రియాక్ట్ అయిన షెర్లీన్.. ఒక లీగల్ నోటీస్ పంపడమే కాకుండా, తనను మెంటల్గా హెరాస్ చేస్తున్నందుకు గాను రూ. 75 కోట్లు చెల్లించాల్సిందిగా డిమాండ్ చేసింది.
"రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి నన్ను మాఫియాతో బెదిరించారు. ఇప్పుడు నాకు పరువునష్టం నోటీసు పంపారు. కానీ నేను భయపడను. నా ఫిర్యాదుపై విచారణ చేపట్టేందుకు నా స్టేట్మెంట్ను రికార్డ్ చేయమని పోలీసులను అభ్యర్థిస్తున్నాను. మానసికంగా వేధిస్తున్నందుకు గాను రూ. 75 కోట్లు అడుగుతూ రిప్లై నోటీస్ పంపాను." అని చెప్పింది షెర్లీన్.