Read more!

English | Telugu

బ‌న్నీ సినిమా రీమేక్‌లో కృతి స‌న‌న్?

ఢిల్లీ డాళ్ కృతి స‌న‌న్ ప్ర‌స్తుతం చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉంది. త‌ను టైటిల్ రోల్ లో న‌టించిన‌ `మిమి` ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకోగా.. `హ‌మ్ దో హ‌మారే దో` పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్ లో ఉంది. అలాగే `బ‌చ్చ‌న్ పాండే`, `బేదియా` చిత్రాలు చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్నాయి.  ఇక త‌న కెరీర్ లోనే ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్ర‌మైన `ఆదిపురుష్`.. అతి త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ ముద్దుగుమ్మ మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిందట‌. ఆ వివ‌రాల్లోకి వెళితే.. తెలుగునాట ఘ‌న‌విజ‌యం సాధించిన `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఓ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ నిర్మించ‌నున్న ఈ మూవీకి రోహిత్ ధావ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని ప్రచారం సాగుతోంది. అంతేకాదు.. యంగ్ హీరో కార్తిక్ ఆర్య‌న్ క‌థానాయ‌కుడిగా న‌టించ‌నుండ‌గా.. పూజా హెగ్డే పాత్ర‌లో కృతి స‌న‌న్ ద‌ర్శ‌న‌మివ్వ‌నుంద‌ని టాక్. ఇప్ప‌టికే కార్తిక్, కృతి.. `లూకా చుప్పి` చిత్రంలో జంట‌గా అల‌రించారు. త్వ‌ర‌లోనే `అల వైకుంఠ‌పుర‌ములో` హిందీ రీమేక్ పై మ‌రింత క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

మ‌రి.. బ‌న్నీ సినిమా రీమేక్.. కృతి కెరీర్ కి ఏ మేర‌కు ప్ల‌స్ అవుతుందో చూడాలి.