English | Telugu
తల్లిదండ్రుల్ని దత్తత తీసుకోనున్న కృతి సనన్!
Updated : Aug 27, 2021
`1 నేనొక్కడినే` బ్యూటీ కృతి సనన్.. తల్లిదండ్రుల్ని దత్తత తీసుకోబోతోందట. అయితే.. ఇదేదో రియల్ లైఫ్ లో అనుకునేరు! కానే కాదు.. ఓ హిందీ చిత్రం కోసం రీల్ లైఫ్ లో ఈ ఆదర్శవంతమైన కార్యం చేయబోతోంది కృతి.
ఆ వివరాల్లోకి వెళితే.. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ రాజ్ కుమార్ రావ్ తో కలిసి కృతి ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ చేస్తోంది. ఆ చిత్రమే.. `హమ్ దో హమారే దో`. ఇందులో తల్లిదండ్రుల్ని దత్తత తీసుకోవాలనుకునే జంటగా రాజ్, కృతి కనిపించబోతున్నారు. చక్కటి సందేశానికి వినోదాన్ని మేళవించి రూపొందిస్తున్న ఈ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీలో వృద్ధ దంపతులుగా పరేశ్ రావెల్, రత్నా పాఠక్ షా కనిపించనున్నారు. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయిన `మిమి`లో సరోగేట్ మదర్ గా కెరీర్ బెస్ట్ ఫెర్మార్పెన్స్ తో అలరించిన కృతి.. ఈ సినిమాతో అంతకుమించి గుర్తింపు తెచ్చుకుంటానన్న ధీమాతో ఉంది. మరి.. కృతి నమ్మకం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.
కాగా, ప్రస్తుతం ప్రభాస్ సరసన మైథలాజికల్ మూవీ `ఆదిపురుష్`లో నటిస్తోంది కృతి. ఇందులో సీతగా ఆమె దర్శనమివ్వనుంది. 2022 ఆగస్టు 11న `ఆదిపురుష్` థియేటర్స్ లో సందడి చేయనుంది.
