English | Telugu
షారుక్ - హిరాణి మూవీ.. నేపథ్యం అదేనా?
Updated : Aug 24, 2021
బాలీవుడ్ లో అపజయమంటూ ఎరుగని దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందాడు రాజ్ కుమార్ హిరాణి. `మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్` (2003), `లగే రహే మున్నాభాయ్` (2006), `3 ఇడియట్స్` (2009), `పీకే` (2014), `సంజు` (2018).. ఇలా వరుసగా ఐదు బ్లాక్ బస్టర్స్ కొట్టిన హిరాణి.. త్వరలో డబుల్ హ్యాట్రిక్ కి సన్నద్ధమవుతున్నాడు. అంతేకాదు.. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కాంబినేషన్ లో ఈ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు.
ఇదిలా ఉంటే.. తన ప్రతీ చిత్రంలో సున్నితమైన హాస్యంతో పాటు సామాజిక సందేశాన్ని జోడించే హిరాణి.. షారుక్ తో చేయబోయే సినిమాకి కూడా అదే పంథాని కొనసాగిస్తున్నాడట. కాగా, ఈ చిత్రం వలస జీవితాల నేపథ్యంలో తెరకెక్కనుందని.. సింహభాగం కెనడాలో చిత్రీకరణ జరుపుకోనుందని బాలీవుడ్ ఖబర్. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొద్ది రోజులు వేచిచూడాల్సిందే.
షారుక్ ఖాణ్ - రాజ్ కుమార్ హిరాణి కాంబో మూవీలో కథానాయికగా తాప్సీ నటించనుంది. 2022 ప్రథమార్ధంలో పట్టాలెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. 2023లో తెరపైకి వచ్చే అవకాశముంది.
