English | Telugu
నెలల పసికందును హోటల్లో మర్చిపోయిన స్టార్ హీరో భార్య!
Updated : Oct 26, 2021
బాలీవుడ్ స్టార్, అంధా ధున్ హీరో ఆయుష్మాన్ ఖురానా భార్య తాహిరా కశ్యప్ ఒకసారి రెస్టారెంట్లో తన నెలల పసికందును మర్చిపోయి, భోజనం అవగానే బయటకు వెళ్లింది. ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయం వెల్లడించింది. 2012లో ఆయుష్మాన్, తాహిరాలకు మొదటి సంతానంగా విరాజ్వీర్ పుట్టాడు. కొద్ది రోజుల తర్వాత అతడిని తీసుకొని, తన ఫ్రెండ్స్తో పాటు లంచ్ చేయడానికి ఒక రెస్టారెంట్కు వెళ్లిందామె.
"రెస్టారెంట్లో నా బిడ్డను మర్చిపోయాను. నా బ్యాగ్ను కానీ, బిల్లును కానీ నేను మర్చిపోలేదు. అయితే నా కొడుకును మర్చిపోయి, బయటకు వచ్చాను. వెయిటర్ పరుగెత్తుకుంటూ వచ్చి, 'మేడమ్ మీరు మీ అబ్బాయిని మర్చిపోయారు' అని చెప్పాడు. అప్పుడు నేనెంత ఇబ్బందిగా ఫీలయ్యానో. జనమంతా నా వంక అలాగే చూశారు" అని చెప్పింది తాహిరా.
అప్పటి ఘటనను మరింతగా వివరిస్తూ, "లంచ్ అయిపోగానే నా ఫ్రెండ్స్ ఒక్కొక్కరినే హగ్ చేసుకొని, ఎలివేటర్లోకి వెళ్లాను. అప్పుడే ఒక స్టాఫ్ మెంబర్ నా దగ్గరకు పరిగెత్తుకు వచ్చాడు. లిఫ్ట్ డోర్ తలుపులు క్లోజ్ అవబోతుంటే, వాటికి కాలు అడ్డం పెట్టాడు. 'మేడమ్, మీరు మీ బాబుని మర్చిపోయారు' అని చెప్పాడు. అప్పుడు లిఫ్ట్లో ఉన్నవాళ్లు చూసిన చూపులు నేనెప్పటికీ మర్చిపోను. జనం బిల్లులు కట్టడం మర్చిపోతుంటారు, లేదంటే తమ బ్యాగ్లు మర్చిపోతుంటారు. కానీ నేను నా బ్యాగ్ మర్చిపోలేదు కానీ, నా బిడ్డను మర్చిపోయాను. అలాంటి పని ఎంతటి క్రూరమైన తల్లి చేస్తుంది?" అని చెప్పింది తాహిరా.
"ఇలాంటి ఘటనలు మరికొన్ని సార్లు కూడా జరిగాయి. పబ్లిక్ హాలిడేస్ అప్పుడు నా పిల్లల్ని స్కూలుకు తీసుకువెళ్లేదాన్ని. అప్పుడు నా పిల్లలు నా వంక చూసిన చూపులు ఇంకా గుర్తున్నాయి. అలాంటి బ్లండర్స్ ఇప్పటికీ ఆగలేదు. అయితే ఇప్పుడు నన్ను నేను మరింతగా క్షమించేసుకుంటున్నా." అని ఆమె చెప్పింది. విరాజ్ వీర్ పుట్టిన రెండేళ్లకు తాహిరాకు వరుష్క అనే కూతురు పుట్టింది.