English | Telugu
లతా మంగేష్కర్ భౌతికకాయం వద్ద షారుఖ్ ఉమ్మేశాడా.. అసలు నిజమేంటి?
Updated : Feb 8, 2022
గానకోకిల లతా మంగేష్కర్ ఆదివారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ముంబైలో జరిగిన ఆమె అంత్యక్రియల్లో సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులు అర్పించారు. వారిలో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కూడా ఉన్నాడు. అయితే షారుఖ్ నివాళులర్పించిన విధానాన్ని తప్పుగా అర్ధం చేసుకున్న కొందరు ఆయనపై మండిపడ్డారు. మరికొందరు మత పరమైన విమర్శలు కూడా చేశారు.
లతా మంగేష్కర్ అంత్యక్రియల్లో పాల్గొన్న షారూఖ్ ఆమె భౌతికకాయం చుట్టూ తిరిగి చేతులు జోడించి నమస్కారం చేశాడు. ఇస్లాం మత పద్దతిలో ప్రార్థించిన తర్వాత షారూఖ్ నోటి నుంచి గాలి ఊదారు. అయితే షారుక్ అలా గాలి ఊదడాన్ని ఉమ్ముతున్నట్టుగా క్రియేట్ చేసి కొందరు ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు. హిందువులకు ఉన్నట్లే ముస్లింలకు కూడా మతాచారాలు ఉంటాయని, వారి మతాచారం ప్రకారమే షారుఖ్ దువా చదివి గాలి ఊదారని, అది తెలియకుండా ఇలా ట్రోల్స్ చేయడం కరెక్ట్ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కొందరు తమ రాజకీయ లబ్దికోసం కావాలనే ఇలా మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ అంశంలో సినిమా ప్రముఖులతో పాటు, ఎందరో హిందువులు షారుఖ్ కి మద్దతుగా నిలుసున్నారు.