Guppedantha Manasu: శైలేంద్రని ఎరగా వాడుకొని మనుని బయటకు తీసుకురావాలి!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-1073 లో.. తాను ఇచ్చిన యాభై కోట్ల అప్పు తిరిగి చెల్లించకపోతే కాలేజీని తన సొంతం మను నోటీసులు ఇచ్చాడని దేవయాని, ఫణీంద్రలతో చెబుతాడు మహేంద్ర. ఆ మాట వినగానే మను మంచివాడు కాదని తాను ముందు నుంచే డౌట్ పడుతూనే ఉన్నానని దేవయాని అంటుంది. ప్లాన్ ప్రకారమే కాలేజీకి అప్పు ఉందని తెలుసుకొనే మను డ్రామా ఆడాడని, కాలేజీని తన సొంతం చేసుకోవడానికి అతడు వేసిన స్కెచ్ ఇదని మనుపై మనసులో ఉన్న ద్వేషం మొత్తం బయటపెడుతుంది.