బ్రేకింగ్ న్యూస్ చదివేవాళ్ళతో ఐటెం సాంగ్స్ కి డాన్స్ చేయించిన ఓంకార్
సిక్స్త్ సెన్స్ సీజన్ 5 చాలా గమ్మత్తైన గేమ్ షోగా బుల్లితెర మీద సెన్సేషన్ సృష్టిస్తోంది. ప్రతీ వారం ఈ షోకి సెలబ్రిటీస్ వచ్చి ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఇక యాంకర్ ఓంకార్ వాళ్లకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తూ గేమ్ షోని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ వీక్ గేమ్ షోకి ఒక న్యూస్ ఛానల్ లో బ్రేకింగ్ న్యూస్ చదివే దీప్తి వాజపేయి, ప్రత్యూష వచ్చారు. అలాగే బిగ్ బాస్ టీమ్ నుంచి ఆదిరెడ్డి, గీతూ రాయల్, యాంకర్ శివ కూడా ఎంట్రీ ఇచ్చారు.