English | Telugu

బ్రేకింగ్ న్యూస్ చదివేవాళ్ళతో ఐటెం సాంగ్స్ కి డాన్స్ చేయించిన ఓంకార్

సిక్స్త్ సెన్స్ సీజన్ 5 చాలా గమ్మత్తైన గేమ్ షోగా బుల్లితెర మీద సెన్సేషన్ సృష్టిస్తోంది. ప్రతీ వారం ఈ షోకి సెలబ్రిటీస్ వచ్చి ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఇక యాంకర్ ఓంకార్ వాళ్లకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తూ గేమ్ షోని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ వీక్ గేమ్ షోకి ఒక న్యూస్ ఛానల్ లో బ్రేకింగ్ న్యూస్ చదివే దీప్తి వాజపేయి, ప్రత్యూష వచ్చారు. అలాగే బిగ్ బాస్ టీమ్ నుంచి ఆదిరెడ్డి, గీతూ రాయల్, యాంకర్ శివ కూడా ఎంట్రీ ఇచ్చారు. "బ్రేకింగ్ న్యూస్ అంటూ సీరియస్ గా ఫేస్ పెట్టి వార్తలు చదివే మాటతో ఐటెం సాంగ్స్ కి డాన్స్ చేయించేస్తున్నారుగా" అంది ప్రత్యూష. ఇక షోలో చీర్ గర్ల్స్ ని చూసి "బాగున్నారా" అని దీప్తి అడిగేసరికి వాళ్లకు అర్ధం కాలేదు. "ఇలాంటి గెస్టులు లైవ్ లో దొరికారంటే ఇక అంతే" అంది దీప్తి. తర్వాత ఆదిరెడ్డి, గీతూ ఆ చీర్ గర్ల్స్ తో డాన్స్ చేశారు. ఇక దీప్తి తన లవ్ స్టోరీని షేర్ చేసుకుంది. ప్రత్యూష తన పిల్లల్ని కూడా ఈ షోకి తీసుకొచ్చింది.

బిగ్ బాస్ తర్వాత డిప్రెషన్ లోకి ఎందుకు వెళ్ళావ్ అని ఓంకార్ గీతూని అడిగాడు. "గీతూ నేను నీ కోసమే బతుకుతున్నది. చచ్చిపోతాను అనే థాట్ నీ మైండ్ లోకి వచ్చిన ముందు క్షణమే నేను చచ్చిపోతాను అని మా నాన్న అన్నారు. అప్పటినుంచి నేను మా పేరెంట్స్ కోసం ఉండాలి అనుకున్నా..వాళ్ళు నా కోసం ఎంతో కష్టపడుతూ ఉన్నారు కదా. వాళ్ళ కోసం కూడా నేను ఏదో ఒకటి చేయాలి కదా..ఎవరో వచ్చి ఏదో చేశారని అస్సలు డిప్రెస్ అవ్వకూడదు" అని చెప్పింది గీతూ. ఇక యాంకర్ స్రవంతి చొక్కారపు మాత్రం కొంచెం ఎక్కువ చేసింది ఈ షోలో. చిన్నప్పుడు వాళ్ళ అమ్మకి చెప్పిందట తానూ పెద్దయ్యాక ఓంకార్ ని పెళ్లి చేసుకుంటా అని. ఇక అలా చెప్తూనే తెగ సిగ్గు పడిపోయి "సిరిమల్లె పువ్వా" సాంగ్ కి ఓంకార్ ని చూపిస్తూ డాన్స్ చేసింది. ఇలా రాబోయే వారం షో అలరించబోతోంది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.