English | Telugu

అసలు రాజేంద్రప్రసాద్ ఎలాంటోడు.. నిజాలు బయటపెట్టిన అశోక్ కుమార్!

అసలు రాజేంద్రప్రసాద్ ఎలాంటోడు.. నిజాలు బయటపెట్టిన అశోక్ కుమార్!

Publish Date:Jun 4, 2025

  సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇటీవల సినిమా వేదికలపై మాట్లాడుతున్న మాటలు వివాదాస్పదమవుతున్నాయి. ముఖ్యంగా రీసెంట్ గా ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. ఆలీని ఒక బూతు మాట అనేశారు. రోజాని దాన్ని అన్నారు. ఇలా రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఆయనపై విమర్శలు కూడా వచ్చాయి. దీనిపై స్పందించిన రాజేంద్రప్రసాద్.. చనువు ఉన్నవారినే అలా సరదాగా అంటుంటానని చెప్పారు. ఆలీ కూడా రాజేంద్రప్రసాద్ కావాలని అనలేదని, ఈ విషయాన్ని పెద్దది చేసి చూడొద్దని కోరారు. తాజాగా ప్రముఖ నటుడు అశోక్ కుమార్ ఈ అంశంపై స్పందించారు.    రీసెంట్ గా తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. రాజేంద్రప్రసాద్ తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు అశోక్ కుమార్. "మా తరం నటీనటులంతా సరదాగా ఉంటాం. ఆ చనువుతో షూటింగ్ లొకేషన్స్ లో ఏరా అని మాట్లాడుకుంటాం. అయితే పదిమందిలో ఉన్నప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. కానీ ఒక్కోసారి మనకి తెలియకుండానే మాట్లాడేస్తుంటాం. బయట ఉన్న రిలేషన్, చనువుతో ఫ్లోలో ఏదోకటి అనేస్తుంటాం. వాటిని చూసీ చూడనట్టు వదిలేయాలి. ఆలీ కూడా స్టేట్ మెంట్ ఇచ్చాడు. వాళ్ళిద్దరి రిలేషన్ బాగున్నప్పుడు.. మిగతా వాళ్ళు దానిని పెద్దది చేసి చూడకూడదు. నన్ను రాజేంద్రప్రసాద్ బయట ఏరా అంటారు. ఆ చనువుతో ఒక ఈవెంట్ లో ఏరా నీ గుండు మీద ఒట్టు అన్నారు. దానిని నేను సరదాగా తీసుకున్నాను. కానీ, కొందరు మాత్రం అశోక్ కుమార్ మీద నోరు జారిన రాజేంద్రప్రసాద్ అని రాసేశారు. నాతో ఉన్న చనువు కొద్దీ ఫ్లోలో ఆయన అలా అనేశారు అంతే." అని అశోక్ కుమార్ చెప్పుకొచ్చారు.    
Criminal Justice - A Family Matter Web Series Review

Criminal Justice - A Family Matter Web Series Review

Publish Date:Jun 4, 2025

Cast: Pankaj Tripathi, Mohammed Zeeshan Ayyub, Surveen Chawla, Asha Negi, Khushboo Atre, Mita Vashisht, Shweta Basu Prasad, Barkha Singh, Khushi Bharadwaj Crew:  Created by Harman Wadala, Rahul Ved Prakash, Varsha Ramachandran, Riya Poojary Written by Harman Wadala, Sandeep Jain, Sameer Mishra Directed by Rohan Sippy Produced by Sameer Nair, Deepak Segal, Sameer Gogate Genre: Crime, Legal drama, Thriller OTT Platform: Jio Hotstar Criminal Justice series has been successful as an Indian legal drama with Pankaj Tripathi in the lead role. His character Advocate Madhav Mishra has been consistently loved by audiences because of his likeable performance. In the previous season, Shweta Basu Prasad came into the mix and now, Mohammed Zeeshan Ayyub, Surveen Chawla, Asha Negi have been added into important characters. Let's discuss about this Family Matter being dragged to court in detail.  As only three episodes have been released, we cannot give a complete plotline but Madhav Mishra is now defending Raj Napal (Mohammed Zeeshan Ayyub) who is believed to have murdered nurse Roshni Saluja (Asha Negi) at his daughter's birthday party. Anju Nagpal (Surveen Chawla, Raj's wife is trying to hard to prove the truth.  As per the first three episodes released, this season is not as good as the first three. From the first episode itself, the drama looks very unconvincing and farcical. The drama tries to showcase how Madhav Mishra is also growing a reputation and tries to give him more character but it fails to establish the case as well as it did in previous seasons.  Here, even the performances feel a little bit off and too melodramatic. The series needed much more grounded approach from the first minute rather than it going into this dramatic zone. Being a legal drama, it needed a lot more grounded approach. Pankaj Tripathi is likeable but as Madhav Mishra, he needs much more writing help and this character seems to have gone stale. Surveen Chawla and Mohammad Zeeshan Ayyub don't get great start.  Early in the show, it might not be great to judge complete one but the start is not that interesting or inspiring for needing more. Let's hope the season 4 does redeem itself in upcoming episodes and deliver better.  Rating: 2.25/5 (for first three episodes) Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them.    

50 ఏళ్ళు తన గాన మాధుర్యాన్ని పంచిన ఎస్‌.పి.బాలు సినీ ప్రస్థానం ఇదే!

Publish Date:Jun 3, 2025

(జూన్‌ 4 ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా..) ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం.. సంగీత ప్రియులకు పరిచయం అవసరం లేని పేరు. ఆయన మాటలు మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. ఆయన పాటలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అచ్చమైన తెలుగు, స్వచ్ఛమైన తెలుగు ఆయన మాటల్లో, పాటల్లో ధ్వనిస్తుంది. ఒక దశలో ఆయన పాట లేని సినిమా లేదు. ఆయన పాట వినిపించని ఇల్లు లేదు. ఆయన పాట లేని మ్యూజికల్‌ నైట్‌ లేదు. ప్రేమ గీతమైనా, విషాద గీతమైనా, నవ్వులు పూయించే పాటైనా, శాస్త్రీయ సంగీతమైనా ఆయన గళం నుంచి వచ్చింది అంటే శ్రోతలు మంత్రముగ్ధులు అవ్వాల్సిందే. ఘంటసాల, పి.బి.శ్రీనివాస్‌, ఏసుదాస్‌ వంటి దిగ్గజ నేపథ్యగాయకులు తెలుగు సినిమా సంగీతాన్ని ఏలుతున్న రోజుల్లో ఓ యువ కెరటంలా వచ్చి తనకంటూ ఓ ప్రత్యేకమైన పేజీని సృష్టించుకున్న గాయకుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం. దేశంలోని 16 భాషల్లో 50 వేలకుపైగా పాటలు పాడి గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్న బాలు సినీ నేపథ్య గాయకుడిగా తన జీవితాన్ని ఎలా ప్రారంభించారు? సింగర్‌గా ఎదిగే క్రమంలో ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? 50 సంవత్సరాలకు పైగా సంగీత ప్రియులను అలరించిన ఆయన జీవన ప్రయాణం ఎలా సాగింది? అనే విషయాల గురించి తెలుసుకుందాం.  1946 జూన్‌ 4న నెల్లూరు జిల్లా కోనేటమ్మపేటలో శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు జన్మించారు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. తండ్రి హరికథ కళాకారుడు. వారి ఇంట్లో నిత్యం పండితులు, కవులు సాహిత్యపరమైన చర్చలు జరిపేవారు. దాంతో బాలుకి తెలుగు భాషపై ఆసక్తి పెరిగింది. తండ్రి హరికథలు చెప్తుండడంతో అతనికి సంగీతంపై మక్కువ ఏర్పడింది. రేడియోలో వచ్చే పాటలు వింటూ వాటినే ప్రాక్టీస్‌ చేసేవారు. పియుసి చదివే రోజుల్లోనే ఒక లలిత గీతాన్ని స్వయంగా రాసి, స్వరపరిచి రేడియోలో పాడారు. ఆ పాటకు బహుమతి లభించింది. ఆ తర్వాత నెల్లూరు వెళ్లి మిత్రులతో కలిసి ఆర్కెస్ట్రా ఏర్పాటు చేశారు. దాని ద్వారా ప్రదర్శనలు ఇచ్చేవారు. తన కొడుకు ఇంజనీరు కావాలని సాంబమూర్తి కలలు కనేవారు. తండ్రి కోరిక మేరకు మద్రాస్‌లో ఎ.ఎం.ఐ.ఇ. కోర్సులో చేరారు బాలు. కాలేజీలో చదువుకుంటూనే పాటల పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకునేవారు.  1964లో మద్రాస్‌లో జరిగిన లలిత సంగీత పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ఘంటసాల, పెండ్యాల, ఎస్‌.పి.కోదండపాణి హాజరయ్యారు. అందులో బాలుకి ప్రథమ బహుమతి లభించింది. ఆ సమయంలోనే బాలుకి సింగర్‌గా అవకాశం ఇస్తానని కోదండపాణి మాట ఇచ్చారు. దాని ప్రకారమే పద్మనాభం నిర్మించిన శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రంలో పి.బి.శ్రీనివాస్‌, రఘురామయ్య, పి.సుశీలతో కలిసి పాట పాడే అవకాశం ఇచ్చారు కోదండపాణి. ‘ఏమి ఈ వింత మోహం..’ అంటూ సాగే పాట ద్వారా చిత్ర రంగ ప్రవేశం చేశారు బాలు. ఆ తర్వాత తన దగ్గరకు వచ్చే దర్శకనిర్మాతలకు బాలు పాడిన పాటను వినిపించి అతనికి అవకాశాలు ఇప్పించేవారు కోదండపాణి. అలా తనకు సినీ గాయకుడిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో తర్వాతి కాలంలో తను నిర్మించిన ఆడియో లాబ్‌కి కోదండపాణి పేరే పెట్టుకున్నారు బాలు. 1968లో విడుదలైన సుఖదు:ఖాలు చిత్రంలో బాలుకి మూడు పాటలు పాడే అవకాశం ఇచ్చారు కోదండపాణి. అందులో ‘మేడంటే మేడా కాదు..’ అనే పాట బాలుకి సింగర్‌గా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అప్పటి నుంచి శోభన్‌బాబు, కృష్ణ, చలం, హరనాథ్‌, చంద్రమోహన్‌ వంటి హీరోలకు వరసగా పాటలు పాడుతూ వచ్చారు బాలు.  అప్పటివరకు తన పాటలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ వచ్చిన ఘంటసాల.. ఆరోగ్య రీత్యా 1965 తర్వాత తనకు తానుగా పాటలు తగ్గించుకున్నారు. ఆ సమయంలో బాలుకి బాగా అవకాశాలు వచ్చాయి. కొన్ని పాటలకు బాలుని ఘంటసాల రికమెండ్‌ కూడా చేసేవారు. 1974లో ఘంటసాల కన్ను మూసిన తర్వాత బాలు నెంబర్‌వన్‌ సింగర్‌ అవుతారని అంతా భావించారు. కానీ, అతనికి అవకాశాలు తగ్గిపోయాయి. దానికి కారణం అప్పుడే కొత్తగా వచ్చిన సింగర్‌ రామకృష్ణ. ఘంటసాల గొంతుని పోలి ఉండడంతో ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌, శోభన్‌బాబు, కృష్ణంరాజు వంటి హీరోలు.. తమ సినిమాలో అతనే పాడాలని కండిషన్‌ పెట్టారు. ఆ దశలో బాలుకి అవకాశాలు బాగా తగ్గిపోయాయి. అలాంటి సమయంలో అతన్ని ప్రోత్సహించారు సూపర్‌స్టార్‌ కృష్ణ. సంవత్సరానికి ఐదారు సినిమాలకు తక్కువ కాకుండా చేసే కృష్ణకు అన్ని పాటలూ పాడేవారు బాలు. మరోపక్క రామకృష్ణ పెద్ద హీరోలందరికీ పాటలు పాడుతున్నారు. స్వతహాగా బాలుకి మిమిక్రీ కళ తెలుసు. ఏ హీరో ఎలా మాట్లాడతారు, పాట పాడితే ఎలా ఉంటుంది అనే విషయాలపై అవగాహన ఉంది. ఆ సమయంలో సంగీత దర్శకుడు చలపతిరావు ఇచ్చిన సలహా బాలుకి బాగా ఉపయోగపడింది. హీరోలకు తగ్గట్టుగా గొంతులో కొంత మార్పు చేసి పాడితే సక్సెస్‌ అవుతావని ఆయన చెప్పారు. అలా ఆలుమగలు చిత్రంలోని ‘ఎరక్కపోయి వచ్చాను.. ఇరుక్కుపోయాను..’ అనే పాటను అక్కినేని నాగేశ్వరరావును అనుకరిస్తూ పాడడం అందర్నీ ఆకట్టుకుంది. ఇక అక్కడి నుంచి బాలు కెరీర్‌ ఒక్కసారిగా ఊపందుకుంది. ఎన్టీఆర్‌ నుంచి చిన్న హీరోల వరకు అందరూ బాలుతోనే పాటలు పాడించుకోవాలని డిసైడ్‌ అవ్వడంతో అతనికి వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు.  1980లో వచ్చిన ‘శంకరాభరణం’ ఎస్‌.పి.బాలు కెరీర్‌ని పెద్ద మలుపు తిప్పింది. కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని పాటల్ని బాలుతోనే పాడించాలని కె.వి.మహదేవన్‌ అనుకున్నారు. అయితే శాస్త్రీయ సంగీతం తెలియని బాలు ఆ పాటలు పాడేందుకు ఒప్పుకోలేదు. అప్పుడు మహదేవన్‌ శిష్యుడు పుహళేంది.. బాలుకి శిక్షణ ఇచ్చి ఆ పాటలు పాడించారు. ఆ పాటలు ఎంతటి ప్రజాదరణ పొందాయో అందరికీ తెలిసిందే. ఈ ఒక్క సినిమాతో బాలు తిరుగులేని సింగర్‌ అయిపోయారు. అప్పుడు మొదలు దాదాపు 30 సంవత్సరాలపాటు పెద్దా, చిన్నా హీరోలందరికీ తనే పాడుతూ బిజీ సింగర్‌ అయిపోయారు. ఆయన పాడిన పాటల గురించి ప్రస్తావించడం హాస్యాస్పదమే అవుతుంది. ఎందుకంటే తెలుగు శ్రోతలు, ప్రేక్షకుల మనసుల్లో ఆయన పాడిన పాటలు ఎప్పుడూ మారు మోగుతూనే ఉంటాయి. ఆ పాటలను మళ్ళీ గుర్తు చెయ్యాల్సిన అవసరం లేదు.  నేపథ్య గాయకుడిగానే కాకుండా నటుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. 1969లో వచ్చిన పెళ్లంటే నూరేళ్ళ పంట చిత్రంలో మొదటిసారి నటించారు. ఆ తర్వాత ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించారు. స్వతహాగా మంచి హాస్యప్రియుడైన బాలు.. సినిమాల్లో కూడా అలాంటి క్యారెక్టర్స్‌ చేసేందుకే ఇష్టపడేవారు. నటుడిగా ఆయన కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిపోయే సినిమా మిథునం. ఈ చిత్రంలోని నటనకుగానూ నంది పురస్కారాన్ని అందుకున్నారు బాలు. చిత్ర పరిశ్రమలోకి వచ్చిన కొన్నాళ్ళ తర్వాత కొంత సంగీత పరిజ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత సంగీత దర్శకుడిగా మారి దాదాపు 50 సినిమాలకు సంగీతాన్నందించారు. అంతేకాదు, డబ్బింగ్‌ కళాకారుడిగా కూడా రాణించి ఎంతో మంది నటులకు తన గాత్రాన్ని అందించారు. 1976లో కె.బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన మన్మథలీల చిత్రంలో తొలిసారి డబ్బింగ్‌ చెప్పారు. ఈ సినిమాలో కమల్‌హాసన్‌కు సంగీత దర్శకుడు చక్రవర్తి డబ్బింగ్‌ చెప్పగా, అతని దగ్గర పనిచేసే అసిస్టెంట్‌కి బాలు తన వాయిస్‌ని ఇచ్చారు. ఆ తర్వాత కమల్‌హాసన్‌, రజినీకాంత్‌, సల్మాన్‌ ఖాన్‌ వంటి స్టార్‌లతోపాటు ఎంతో మంది నటులకు తన గాత్రాన్ని అందించారు బాలు.  ఎస్‌.పి.బాలు అజాత శత్రువు.. ఎవరితోనైనా స్నేహం చేయగల స్నేహశీలి. 50 సంవత్సరాల్లో చిన్న వివాదం కూడా లేని కెరీర్‌ని నడిపారు బాలు. హీరోలు, దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు.. తోటి సింగర్స్‌.. ఇలా అందరితోనూ స్నేహభావంతోనే మెలిగేవారు. ఎవరికైనా ఆపద వస్తే ముందుకు వచ్చి ఆదుకునేవారు. ఈ లక్షణం అందరికీ నచ్చడం వల్ల అందరికీ బాలు ఎంతో ఇష్టుడయ్యారు. అయితే టాలెంట్‌ ఉండడం వల్లే అది సాధ్యమైంది. ఒకప్పుడు మహ్మద్‌ రఫీని భారతీయ గాయకుడు అని పిలిచేవారు. ఎందుకంటే ఆయన హిందీలోనే కాకుండా కొన్ని ప్రాంతీయ భాషల్లో కూడా పాటలు పాడారు. బాలసుబ్రహ్మణ్యం విషయానికి వస్తే.. 16 భాషల్లో పాటలు పాడారు. కొన్ని లిపి లేని భాషల్లో కూడా పాటలు పాడి రికార్డు సృష్టించారు. అలా మహ్మద్‌ రఫీ తర్వాత భారతీయ గాయకుడుగా ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం పేరును చెప్పుకోవచ్చు. ఇక బాలు అందుకున్న పురస్కారాల గురించి చెప్పాలంటే.. భారతదేశంలోని ఏ గాయకుడికీ లభించని గౌరవం బాలుకి దక్కింది. లెక్కకు మించిన అవార్డులు ఆయన్ని వరించాయి. కేంద్ర ప్రభుత్వం అందించే పద్మశ్రీ, పద్మభూషణ్‌, పద్మ విభూషణ్‌ పురస్కారాలతోపాటు ఉత్తమ గాయకుడిగా 6 జాతీయ అవార్డులు అందుకున్నారు.

మూడో భార్యని కలవడానికి ముందు థెరపీ చేయించుకున్నాను..దటీజ్ అమీర్ ఖాన్ 

Publish Date:Jun 2, 2025

భారతీయ సినీప్రేమికులకి పరిచయం అక్కర్లేని పేరు 'అమీర్ ఖాన్'(Aamir Khan). సుదీర్ఘ కాలం నుంచి ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాల్లో నటిస్తు అశేష అభిమానులని సంపాదించాడు. ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రాల జాబితాలో అమీర్ నటించిన 'దంగల్' మూవీనే ఉందంటే అమీర్ ప్రభావం ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. వ్యక్తి గత విషయానికి వస్తే తన రెండో భార్య 'కిరణ్ రావు' నుంచి విడాకులు తీసుకున్న అమీర్, చాలా కాలంగా ఒంటరిగానే ఉంటు వస్తున్నాడు. కానీ మార్చిలో జరిగిన తన 60 వ పుట్టిన రోజు సందర్భంగా' గౌరీ స్ప్రాట్ '(Gauri Spratt)అనే ఆమెతో డేటింగ్ లో ఉన్నట్టుగా చెప్పుకొచ్చాడు. రీసెంట్ గా ఈ విషయంపై అమీర్ మాట్లాడుతు  నేను 'గౌరీ' ని కలవడానికి ముందుకు థెరపీ చేయించుకున్నాను. దీంతో  నా ఆరోగ్యంపై దృష్టి పెట్టి, నన్ను నేను ప్రేమించుకోవడం ప్రారంభించాను. అనుకోకుండా కలిసిన మా ఇద్దరి మధ్య కొన్నాళ్లకి ప్రేమ పుట్టింది. గౌరీ, నేను భార్య భర్తలం కాకపోవచ్చు. కానీ ఎప్పటికి కలిసే ఉంటాం. పిల్లలు, తల్లి తండ్రులు ఉన్నారు కదా, భాగస్వామ్యం  అవసరం ఏముందని అనుకున్నాను. కానీ గౌరీ ప్రేమతో అవసరం తెలిసింది. నా స్నేహితులు కూడా ప్రతి విషయంలో మద్దతుగా నిలిచారని    చెప్పుకొచ్చాడు.   బెంగళూరుకు చెందిన గౌరీ లండన్ లో ఎఫ్‌డీఏ 'స్టైలింగ్ అండ్ ఫోటోగ్రఫీ'లో శిక్షణ పొందింది. ముంబై, బెంగళూరులలో గౌరీ కుటంబానికి కొన్ని సెలూన్స్ ఉన్నాయి.అమీర్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ లో  చాలా కాలం నుంచి పని చేస్తూ వస్తుంది. ఆమెకు ఆరేళ్ల పాప కూడా  ఉంది. ఇక అమీర్ అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే ఈ నెల 6 న 'తారే జమీన్ పర్' కి సీక్వెల్ గా తెరకెక్కిన 'సితారే జమీన్ పర్' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ తర్వాత తన కలల ప్రాజెక్టు 'మహాభారతం' ని తెరకెక్కించాలనే పట్టుదలతో అమీర్ ఉన్నాడు.  

ప్రపంచం మర్చిపోయినా నేను మర్చిపోను.. థాంక్యూ శివయ్య

Publish Date:Jun 4, 2025

  బుల్లితెర మీద అష్షు రెడ్డి ఒక హాట్ బాంబ్. ఆర్జీవి బ్యూటీ..జూనియర్ సమంత..పవన్ కళ్యాణ్ ఫ్యాన్..ఇలా ఆమె గురించి చాలా చెప్పుకోవచ్చు. ఐతే ఇదంతా జీవితంలో ఒక భాగం. అష్షు లైఫ్ లో మరో భాగాన్ని చూస్తే ఆమె ఒక ఫైటర్..జీవితాన్ని గెలిచిన అమ్మాయి. ఎందుకంటే ఆమెకు బ్రెయిన్ సర్జరీ జరిగింది. దాని నుంచి కోలుకుని మళ్ళీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడం అంటే చాలా కష్టమైన పని. ఒక్కసారి చావు అంచుల వరకు వెళ్లి వచ్చాక ఆ జీవితం ఎప్పటికీ అలా గుర్తు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు అలాంటి తన బ్రెయిన్ సర్జరీ విషయం కూడా అంతే. రీసెంట్ గా ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. "ప్రపంచం మర్చిపోవచ్చు..కానీ నేను ఎప్పటికీ మర్చిపోను. ఈ జూన్ 4 వస్తే నాకు బ్రెయిన్ సర్జరీ జరిగి ఏడాది పూర్తయ్యింది. థ్యాంక్యూ అనే ఒకే ఒక్క పదమే నా మైండ్ లో వస్తుంది" అంటూ థాంక్యూ శివయ్య, రిబోర్న్,  బ్రెయిన్  సర్జరీ అంటూ హ్యాష్ టాగ్స్ పెట్టింది. అలాగే ఒక ఫైటర్ అని రాసి ఉన్న ఒక చాకోలెట్ కేక్ పిక్ ని పోస్ట్ చేసింది అష్షు రెడ్డి. ఆ పోస్ట్ కి హీరో అరవింద్ కృష్ణ మెసేజ్ చేసాడు. "చాలా గర్వంగా ఉంది.  నీ కం బ్యాక్ అనేది చాల ఇన్స్పైరింగ్ గా మనసుల్ని కదిలించేదిగా ఉంది. నీకంతా మంచే జరగాలి" అని విష్ చేసాడు. ఇక అష్షు మూవీస్ విషయానికి వస్తే ఛల్ మోహన రంగా, ఏ మాష్టర్ పీస్ వంటి మూవీస్ లో నటించింది. బిగ్ బాస్ సీజన్ 3 , బిగ్ బాస్ నాన్ స్టాప్ షోస్ లో పార్టిసిపేట్ చేసింది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది అష్షు .

Nazeeruddin Shaik wins aha Telugu Indian Idol 3

Publish Date:Sep 23, 2024

In a thrilling grand finale streamed on aha OTT, 19-year-old Nazeeruddin Shaik from Andhra Pradesh emerged victorious as the winner of aha Telugu Indian Idol Season 3. His captivating performances throughout the competition earned him both the prestigious title and a cash prize of Rs. 10 lakh. Recently clearing his CA intermediate examinations, Nazeeruddin also received the exciting opportunity to lend his voice to the highly anticipated upcoming film starring Pawan Kalyan, OG. His remarkable journey to victory was characterised by consistent excellence, which endeared him to both the audience and the judges. Anirudh Suswaram secured second place, winning Rs. 3 lakh, while GV Shri Kerthi claimed third place with a prize of Rs. 2 lakh. The show, which concluded after nearly 26 weeks of fierce competition, was judged by the esteemed Thaman S, Geetha Madhuri, and Karthik, all of whom noted that this season showcased extraordinary talent. Judge Geetha Madhuri said, "aha Telugu Indian Idol Season 3 was an incredible experience filled with talented contestants. It truly felt like a celebration of music. Choosing the finalists was extremely challenging, and every elimination was painful." Nazeeruddin was born on November 2, 2004, in Tadepalligudem to Shaik Baji, a motor mechanic, and Madeena Beebi, who passed away a year ago. His sister, Vahida Rehman, has stepped in to support him after their mother's passing. He completed his schooling at Vignana Vikas E.M School and continued his education at GSR E.M School. He pursued his Junior College and CA Intermediate at Sri Medha Commerce College in Guntur, aspiring to become a Chartered Accountant while nurturing his passion for music. Nazeeruddin's musical journey has been profoundly shaped by his maternal grandparents, Kasim Saheb and Fatima Bee. His maternal grandmother, a Carnatic music guru, played a pivotal role in cultivating his talent. Growing up listening to the iconic songs of Ghantasala ignited his dedication to music. Reflecting on his victory, Nazeeruddin shared, "My journey with music began when I was just four years old. It was my grandfather, Kasim garu, and his sister whom I affectionately call Nani, who introduced me to this world. She enrolled me in Carnatic music lessons, while my grandfather taught me the nuances of cinematic music. Having sung for Ghantasala garu, his admiration for him has never wavered. For 47 years, he has honored Ghantasala's memory by observing his death anniversary in our village, Tadepalligudem. Thanks to my grandfather's efforts, a statue of Ghantasala garu stands in our village." "Winning the title of Telugu Indian Idol Season 3 is a key milestone for me. Performing in front of Thaman sir, Geetha Madhuri ma’am, and Karthik sir was an honor. Their feedback, along with lessons from my fellow contestants, has shaped my growth as a singer. Moving forward, I aim to be a leading musician in the industry while pursuing a career in finance, " he added. The competition began with over 15,000 aspiring singers, showcasing immense talent throughout the season. Initial auditions took place on May 4, 2024, in New Jersey and Hyderabad. The top 12 finalists included Bharat Raj, Keerthana, Keshav Ram, Hari Priya, GV Shri Kerthi, Nazeeruddin, Skanda, Duvvuri Sridhruthi, Rajani Sree, Sai Vallabha, Khushal Sharma, and Anirudh Suswaram. After rigorous eliminations and public voting across 28 episodes, the competition culminated in a final showdown featuring the top five contestants: Anirudh Suswaram, Skanda, Keerthana, Sri Keerthi, and Nazeeruddin. The finalists dazzled in vibrant attire during the blockbuster finale, which included special performances from the judges and contestants. Judge Geetha Madhuri, in a striking red outfit, captivated the audience with her exceptional performance. The Judges Thaman and Karthik also presented outstanding performances during the blockbuster finale episode. The blockbuster finale, streamed on September 20-21, 2024, celebrated the remarkable journeys of these talented singers. If you missed the thrilling finale episode, catch it now only on aha.

కథ, నిర్మాత రెడీ.. వినాయక్‌తో సినిమా అంటేనే భయపడిపోతున్న హీరోలు!

Publish Date:Jun 3, 2025

2000వ దశకంలో  టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన దర్శకుల్లో పూరి జగన్నాథ్‌, ఎస్‌.ఎస్‌.రాజమౌళి, వి.వి.వినాయక్‌ సంచలన విజయాలు అందుకున్నారు. వీరిలో రాజమౌళి.. ఫెయిల్యూర్‌ అనేది లేకుండా తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు.  మరో దర్శకుడు పూరి జగన్నాథ్‌ కెరీర్‌లో హిట్స్‌, ఫ్లాప్స్‌ ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు కొత్త తరహా సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అతను చివరగా గత ఏడాది చేసిన డబుల్‌ ఇస్మార్ట్‌ చిత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇప్పుడు మరో కొత్త సినిమాతో హిట్‌ ట్రాక్‌ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు పూరి. విజయ్‌ సేతుపతి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. టబు ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తారు.  ఇక వి.వి.వినాయక్‌ విషయానికి వస్తే.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, ప్రభాస్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, నితిన్‌ వంటి పెద్ద స్టార్స్‌తో బ్లాక్‌ బస్టర్స్‌ చేసిన తర్వాత ఒక్కసారిగా ఆయన కెరీర్‌ స్తబ్దుగా మారిపోయింది. 2018లో సాయిధరమ్‌తేజ్‌తో చేసిన ఇంటెలిజెంట్‌.. ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ ఒక్క సినిమా ఫ్లాప్‌తో హీరోలెవరూ వినాయక్‌తో సినిమా చేసేందుకు ముందుకు లేదు. 2023లో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో హిందీలో ఛత్రపతి రీమేక్‌ చేశారు. అది కూడా నిరాశనే మిగిల్చింది. దానికితోడు వినాయక్‌ని ఆరోగ్య సమస్యలు వేధించాయి. అయితే ఇటీవల ఆయన కోలుకొని మునుపటి ఉత్సాహంతోనే ఉన్నారని తెలుస్తోంది. మరో సూపర్‌హిట్‌ సినిమా చేసి హిట్‌ ట్రాక్‌లోకి రావాలని వినాయక్‌ ఆశిస్తున్నారు. తన నెక్స్‌ట్‌ సినిమా చేసేందుకు నిర్మాతను కూడా సెట్‌ చేస్తున్నారు. ప్రజెంట్‌ జనరేషన్‌కి కనెక్ట్‌ అయ్యే మంచి కథతో సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు. అయితే హీరో ఎవరు అనేది మాత్రం సస్పెన్స్‌లోనే ఉంది.  ప్రస్తుతం వినాయక్‌ ఫామ్‌లో లేకపోవడం వల్ల ఇప్పుడు టాలీవుడ్‌లో వున్న స్టార్‌ హీరోలెవరూ అతనితో సినిమా చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. అయినప్పటికీ ఇద్దరు, ముగ్గురు హీరోలను అప్రోచ్‌ అయ్యారు. కానీ, ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో యంగ్‌ హీరోలతో వెళితేనే బెటర్‌ అని భావించి సిద్ధు జొన్నలగడ్డతో సినిమా చేసేందుకు వినాయక్‌ ట్రై చేస్తున్నారని తెలుస్తోంది. ‘డిజె టిల్లు’, ‘టిల్లు స్క్వేర్‌’ వంటి సూపర్‌హిట్‌ సినిమాలతో యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న సిద్ధు.. ఇటీవల భాస్కర్‌తో చేసిన ‘జాక్‌’ చిత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో డైరెక్టర్ల ఎంపిక విషయంలో మరింత కేర్‌ తీసుకోవాలని సిద్ధు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే అంతకుముందు భాస్కర్‌ ఎన్నో సూపర్‌హిట్స్‌ ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని ఫ్లాపులతో వెనకపడ్డారు. అలాంటి డైరెక్టర్‌కి ఛాన్స్‌ ఇవ్వడం వల్ల తను ఓ డిజాస్టర్‌ చూడాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో 8 సంవత్సరాలుగా హిట్‌ అనేది లేని వినాయక్‌తో సిద్ధు సినిమా చేసే అవకాశం లేదని స్పష్టమవుతోంది. మరి ఇప్పుడు వినాయక్‌ని హిట్‌ ట్రాక్‌లో పెట్టే హీరో ఎవరు అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. 

Sudha Kongara & Hombale project is going to be Biggest Multistarrer

Publish Date:Jul 12, 2022

Even though it came before 'KGF,' Hombale Films became well-known with that film. The films are being announced, completed, and ready for release as a result of the momentum created by that film. Production is currently working on 'Salaar' in Telugu and 'Tyson' in Malayalam. Other pan-India films have also just been announced.   However, a film directed by Sudha Kongara was recently announced. Except for the fact that they stated that it will be a big film, they did not mention the casting. There are some new rumours floating around about this. If those rumours are true, this combination will be spectacular. According to sources, Sudha Kongara project is going to be multi starrer.  Furthermore, the names of those heroes are currently being spread.   According to the latest rumours, this film would star Suriya and Dulquer Salman, who have established as star heroes in the South with a string of superhits. According to industry reports, Surya, who has become acquainted of Sudha Kongara's direction in 'Akaasham Nee Haddura,' responded OK without even hearing the story. It is stated that discussions about this film are ongoing, and that full details will be released soon. Pre-production work will begin soon.   Hombale is synonymous with big-budget films. This film is expected to be in the same budget range as the previous one. Suriya's film is also popular in Telugu. Dulquer films have a cult following in the South. This combination is surely going to be crazy.

Ranbir and Alia in love

Publish Date:May 10, 2018

భైరవం

Publish Date:May 30, 2025

శుభం

Publish Date:May 9, 2025

సింగిల్

Publish Date:May 9, 2025

హిట్ 3

Publish Date:May 1, 2025

రెట్రో

Publish Date:May 1, 2025

Bhairavam

Publish Date:May 30, 2025

Subham

Publish Date:May 9, 2025

Single

Publish Date:May 9, 2025

Hit 3

Publish Date:May 1, 2025

Retro

Publish Date:May 1, 2025