చర్చీలలో దర్గాలలో...
మందిరాలలో చేసిన
ఆ మౌన ప్రార్థనలు
ఏమైపోయెరా ఈశ్వరా..?
ఇదేమి మాయరా శంకరా..?
నా నవరత్నాల...
నా సంక్షేమ
పథకాల ఫలాలు
అందుకున్న
నా ఎస్సీల...
నా ఎస్టీల...
నా బీసీల...
నా మైనారిటీల...
నా క్రిష్టియన్ల...
నా లబ్దిదారుల...
నా వాలంటీర్ల...
లక్షల ఓట్లు
ఏమైపోయెరా ఈశ్వరా...?
ఇదేమి మాయరా శంకరా..?
నా అవ్వాతల ఆప్యాయతలు
నా అక్కా చెల్లెమ్మల అనురాగాలు
ఏమైపోయెరా ఈశ్వరా...?
ఇదేమి మాయరా శంకరా..?
కులం మతం ప్రాంతం వర్గం చూడక
పార్టీలకతీతంగా బటన్ నొక్కినొక్కి
నేరుగా ఖాతాలకే అందించిన ఆర్థిక సహాయానికి "కృతజ్ఞతగా" గంటల తరబడి క్యూలో నిలబడి వేసిన
ఆ మహిళల...ఆ మైనారిటీ వర్గాల
ఆ క్రిష్టియన్ ల లక్షల ఓట్లు...
ఏమైపోయెరా ఈశ్వరా...?
ఇదేమి మాయరా శంకరా..?
అన్నా...అనగానే
నే నున్నా...నే విన్నా...
నే వస్తున్నా... అంటూ
భరోసానిచ్చి ప్రతి పేదవాని
ఇంట్లో ఓ కొడుకుగా...
అక్కా చెల్లెమ్మలకు
ఓ అన్నగా...ఓ తమ్ముడిగా...
అవ్వాతాతలకు...ఓ మనవడిగా
ఆపదలో ఉన్న రోగులకెందరికో...
ఒక ప్రత్యక్ష దైవంగా...
పేదప్రజల పక్షపాతిగా...ఆశాజ్యోతిగా
జయహో జయహో అని కీర్తింపబడిన
"జననేత"...కన్న
వారాహి నెక్కి వరాలివ్వడమే...
తప్ప ప్రజలకేమీ చేయని
"యువనేత"... కేవలం
21 అసెంబ్లీ సీట్లకు పోటీ చేసి
21 సీట్లు గెలవడం...
2 పార్లమెంటరీ సీట్లకు పోటీ చేసి
2 పార్లమెంటరీ సీట్లు గెలవడం...
ఇదేమి మాయరా శంకరా..?
ఇదెక్కడి వింతరా ఈశ్వరా..?
ఓ పరమేశ్వరా ఏమైంది..?
ఎందుకిలా జరిగింది..?
ఇది విధి నవ్విన విషపు నవ్వా...?
ఇది కాలం చేసిన ఇంద్రజాలమా...?
ఇది అదృశ్యశక్తుల కుట్ర ఫలితమా...?
ఎంతకూ అర్థంకాకున్నదే...
ప్రజాకోర్టులో నా ఓటర్లిచ్చిన
ఈ చారిత్రాత్మకమైన
సంచలనాత్మకమైన ఈ వింత తీర్పు...
ఔరా ఇది ప్రజాతీర్పా..?
కాదుకాదు చీకటిఓట్ల సునామి..?
ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు
ఎవరో అదృశ్య వ్యక్తులు
తమ అతీంద్రియ శక్తితో ఓడించారు...
గట్టిగా దొంగ దెబ్బకొట్టి మట్టికరిపించారు...



