Facebook Twitter
మూడు సందేశాలు విందామా?

కరోనా పుణ్యమాని,

పూజాగదిలోని దేవుళ్ళముందర

ముకిళిత హస్తాలతో నిలుచుని 

ఓ దేవుళ్ళారా ! ఓ దేవతలారా?

ఎక్కడున్నారు ? మీరేమయ్యారు? 

కంటికే కనిపించక,

కాలసర్పమై ప్రపంచాన్ని కాటు వేస్తున్న 

ఈ కరోనా మహమ్మారి నుండి

ఈ ప్రజలందరిని కాపాడమని,ప్రార్థించే

శుభవేళ అందిన మూడు సందేశాలు....

 

భక్తులారా ! భయపడకండి 

భయబ్రాంతులకు గురికాకండి !

దైర్యంగా వుండండి! 

దృడసంకల్పంతో వుండండి!

మళ్ళీవచ్చే ఈ కరోనాకష్టాలు తొలిగి, 

కారుమబ్బులు కరిగి,

చిమ్మచీకట్ల తెరలు చిరిగి,

వేయి సూర్యుళ్ళు ఒక్కసారి 

వెలిగే రోజులు రానున్నాయని

కరోనాను ఖతంచేసే ఆయుధాలు

త్వరలో మీకు అందుతాయని 

ముక్తకంఠంతో దీవించి ముక్కోటిదేవుళ్ళు 

అందించారు "ఓ దివ్య సందేశాన్ని...

 

కరోనా పుణ్యమాని

బద్దకాన్ని వదిలి పెట్టినవారే 

వృద్దిచెందుతారని 

సూర్యునికంటే ముందు 

లేచినవారే సుఖపడతారని

రోజు వాకింగ్,జాగింగ్,

వ్యాయామం యోగా చేసినవారే

ఆరోగ్యం ,ఆనందం, దీర్ఘాయుష్షను 

మూడు వరాలను పొందుతారని,

కమ్మని కిలకిలారావాలతో....

ప్రొద్దుటే నిద్రలేసే అలవాటున్న పక్షులన్నీ

వినిపించాయి "ఓ ఆరోగ్యసందేశాన్ని...

 

కరోనా పుణ్యమాని,

రోజూ,మాదుమ్మును దులిపేస్తే

మా పేజీల గుండెల్ని చీల్చేస్తే

మీకు విజ్ఞానపు గుప్తనిధులు 

దొరుకుతాయని,

అజ్ఞానాంధకారం తొలిగి 

విజ్ఞానంతో బ్రతుకులు వికసిస్తాయని

బీరువాల్లో దుమ్ము కొట్టుకొనివున్న

రామాయణ, మహాభారత,

భాగవత, బైబిల్, భగవద్గీతలు 

అందించాయి"ఓ ఆథ్యాత్మిక సందేశాన్ని...