1984 అక్టోబర్ 31 తేది
ఉదయం 9.20 ని.లకు...
ఏం జరిగిందిరా ?
దేశచరిత్ర రక్తసిక్తమైపోయిందిరా...
కన్నతల్లి ఇందిర కన్నుమూసిందిరా...
చింతిస్తూ ఇందిరా చితికి చేరిందిరా...
శాంతి కపోతమై
శాంతిసందేశాన్ని అందించిన ఇందిర
రక్తాన్ని చిందించిందిరా...
నిరుపేదల తలరాతల రాజ్యాంగాన్ని
సవరించ ఇందిర స్వర్గానికేగిందిరా...
కంచే చేను మేసినట్లుగా
కూర్చున్న కొమ్మనే నరికినట్లుగా
పాలు త్రాగి ఒకడు
తల్లిరొమ్మునే గుద్దినట్లుగా
ఉగ్రవాదుల మిషన్ గన్నులనుండి
ప్రత్యర్థుల తూటాలనుండి
శత్రువుల నుండి మృత్యువునుండి
రాత్రింబవళ్ళు కన్నతల్లి ఇందిరను
రోజూ రక్షించే అంగరక్షకులే...
కడకు కసితీరా.....
పగతో రగిలి రగిలి...
30 బుల్లెట్లతో కాల్చికాల్చి...
ఆమె గుండెను చీల్చి చీల్చి...
ఆమె రక్తపుమడుగులో
"గిలగిల" కొట్టుకుంటూవుంటే
"కిలకిల" నవ్వేరు ఆ కిరాతకులు
ఆ మూర్ఖులు ఆ ముష్కరులు
పగబట్టిన ఆ సిక్కుమతోన్మాదులు...
రెప్పపాటున ఆ తల్లి
కుప్పకూలిపోయింది
దేశమంతా కన్నీటి సంద్రమైంది...
ఎక్కడ మతగ్రంథాలు
మంచిని బోధిస్తాయో
అక్కడ మానవత్వం
ఫరిడవిల్లుతుంది... కానీ
ఎక్కడ ఉగ్రవాదం మతోన్మాదం
పడగవిప్పి బుసలు కొడుతుందో
అక్కడ మహాత్ములరక్తం
ఏరులై పారుతుంది...
"నా చిట్టచివరి రక్తపుబొట్టు" వరకు
"శాంతిసామరస్యం" కోసమే
దేశ "ప్రజలసంక్షేమం" కోసమే
పోరాడుతానని ప్రతినపూని
"గరీబి హటావో" అంటూ నినదించి
తన జీవితాన్ని త్యాగం చేసిన
"ఉక్కుమహిళ" మొట్టమొదటి
మహిళా ప్రధానమంత్రి
మన శ్రీమతి ఇందిరా గాంధీ
అశృనయనాలతో ఆతల్లి కిదే
నా అక్షర నీరాజనం....



