Facebook Twitter
మూడు రైళ్లు..‌.మృత్యఘోష..?

ఒడిశాలోని బాలాసోర్ లో
శుక్రవారం రాత్రి 6.50 నుండి 7.10 
గం.ల మధ్య 20 నిముషాల వ్యవధిలో
అత్యంత వేగంగా..."మృత్యువులా"
దూసుకు వచ్చిన...."మూడు రైళ్లు"
లూపులైన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలు
128 కి.మీ.వేగంతో కోరమాండల్ ఎక్స్ప్రెస్
116 కి.మీ.వేగంతో యశ్వంతపూర్
సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లు
ఒకదానితో ఒకటి "ఢీ" కొట్టుకోగా...
"యుద్దభూమిలో " వీరసైనికుల్లా...
"మరుక్షణంలో ఆ ప్రాంతమంతా
"మారిపోయెగా ...మరుభూమిగా"

ఎందుకు..? 300 మందికి పైగా
అమాయకపు ప్రయాణీకులు
మృత్యువుకోరల్లో చిక్కుకు పోయారు..?

ఎందుకు..? ప్రయాణీకుల రక్తం
పట్టాలపై ...ప్రవహించింది..?
పట్టాలపై చెల్లాచెదురైన శవాలగుట్టలే... 

ఎందుకు..? ఎటుచూసినా
శిధిలాలలో చిక్కుకున్నవారే...
కాళ్ళు చేతులు తెగిపోయినవారే...
బోర్లా పడిన బోగీల్లో ఇరుక్కుపోయివారే...
హృదయ విధారక...భయానక దృశ్యాలే...

ఎందుకు..? మరుభూమిని తలపించేలా
ఆ "ఘటనాస్థలిలో " ఎటువిన్నా
రక్షించమని...ప్రాధేయపడేవారే...
ఆర్తనాదాలు...హాహాకారాలు చేసేవారే...

ఇనుప సువ్వలు
తగిలి...తలలు పగిలి...
ఒళ్ళంతా రక్తపు మరకలతో...
కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నవారే...

తుక్కు తుక్కైన బోగీల్లో చిక్కుకున్న
కుటుంబ సభ్యులు ఎక్కడున్నారో...
ఏమైపోయారో...బ్రతికున్నారో లేదో...
అర్ధంకాని అతి భయానక దుస్థితిలో...
ఆదుకునే..."ఆపన్నహస్తాల" కోసం
ఆశతో ఎదురుచూసే...క్షతగాత్రులే...
ఆసుపత్రిల్లో...స్వచ్చందంగా
రక్తదానం చేసే...మానవతామూర్తులే...

భారతదేశ రైల్వే చరిత్రలో
ఒక్కసారి మూడురైళ్లు ఢీకొనడం...
300 మందికి పైగా ప్రయాణీకులు
మృత్యువు కోరల్లో చిక్కుకుపోవడం...
కనీవినీ ఎరుగని ఈ ఘోర రైలుప్రమాదంలో
ఎక్కడ సాంకేతిక లోపం...ఇదెవరి శాపం..?
ఎందుకు...జరిగింది..?ఎలా...జరిగింది..?
దొంగలెవరు..?దోషులెవరు..?శిక్ష ఎవరికి..?
ప్రైవేటు వ్యక్తులకా..? కార్పోరేట్ శక్తులకా..?
అమాయకపు ప్రయాణీకులకా...ఎవరికి..?

ఈ విధివంచితులను...పాలకులు
అధికారులు...మానవతావాదులు
అక్కున చేర్చుకుని...ఆదుకోవాలని...
మృతుల"ఆత్మకు" శాంతి చేకూరాలని...
క్షతగాత్రులంతా త్వరగా కోలుకోవాలని...
ఆ పరమాత్మను అర్థిస్తూ ఆశతో ప్రార్థిస్తూ...