ఉన్నావా..? అసలున్నావా..?
ఉంటే ఈ లోకం
"కుళ్లు" చూడకున్నావా..? ఉన్నావని...కనుగొన్నామని...
ఎందరెందరో అన్నారు...
ఉన్నావని...చూస్తున్నావని...
"నమ్మి" ఎందరో ఉన్నారు...
ఉన్నావా..? అసలున్నావా..?
ఔను ఈ నేలమీద
తన కళ్ళముందే...తన గుడిముందే...
ఎన్నో ఘోరాలు నేరాలు దారుణాలు
కలనైనా ఊహించని
ఎన్నో "ఘోరమైన రైలు రోడ్డు
ప్రమాదాలు" జరుగుతూవుంటే...
గుడిలోని..."ఆ దైవం"...గ్రుడ్డివానిలా
ఎందుకు..."మౌనవ్రతం" దాల్చినట్లు..
ఎందుకు? ఎందుకు? ఘాటుగా
ప్రశ్నించాడో...ఓ పరమభక్తుడు
ఆ పరమాత్మను ఏనాడో...మరి
ఆ దైవాన్నే అడగాలి ఈనాడే...
ఎందుకు..? ఎందుకు..?
శుక్రవారం రాత్రి 20 నిముషాల
వ్యవధిలో అత్యంత వేగంగా
ప్రయాణించే..."మూడు రైళ్లు"
"ఢీ ఢీ" అంటూ "ఢీ" కొట్టుకున్నాయి..?
ఎందుకు..?ఎందుకు..?
300 మందికి పైగా నాలుగు రాష్ట్రాల
అమాయకపు ప్రయాణికులు...క్షణాల్లో
"మృత్యుకుహరంలో "చిక్కుకుపోయారు..?
నిజంగా ఇది సిగ్నలింగ్ వైఫల్యమా..?
మానవ తప్పిదమా..? ఎవరి పాపం..?
బాధ్యులెవరు...? కఠినమైన శిక్ష ఎవరికి..?ప్రైవేటు వ్యక్తులకా..?కార్పోరేట్ శక్తులకా..?
అమాయకపు ప్రయాణీకులకా..?
అవినీతి అధికారులకా..? ఎవరికి..?
ఆలోచించండి విజ్ఞులారా...!!!



