పుస్తక పఠనమెందుకంటూ
నెట్లోనే అన్నీవున్నాయంటూ
భక్తితో భగవద్గీతను చదవాలని
విద్యార్ధులు కొందరు నెట్ ఓపెన్ చేశారు
పదినిముషాలు భగవద్గీతను
భక్తి శ్రద్దలతోచదివారు, అంతే
ఆపై బ్రేక్ పడింది, కారణం
చక్కని బాపుబొమ్మ ఒకటి
ప్రక్కనే కనపడుతోంది కన్నుకొడుతోంది
మనసును కలవరపెడుతోంది
ఆపై భగవద్గీత ప్రక్కకెళ్ళింది
అందమైన ఒంపుసొంపుల
బాపుబొమ్మ ఒకటి ముందుకొచ్చింది
కన్నార్పకుండా అందరు
అలా చూస్తూ,చూస్తూవుంటే,
క్షణంలో, ఆ బాపుబొమ్మ
ఒక్కసారి బూతుబొమ్మగా మారింది
అంతే, వయసు పులకరించింది.
మనసు పరవశించింది.
కొందరు కోర్కెలతో రగిలిపోయారు
మరికొందరు మత్తులో ఊగిపోయారు
సలసల కాగిపోయారు, సందేహాలతో
విద్యార్థులందరు సతమతమైపోయారు
భగవద్గీతనా?
బాపుబొమ్మనా?
బూతుబొమ్మనా?,ఏది?...
ఏది చూడాలో,ఏది చదవాలో అర్ధంకాక
జుట్టు పీక్కున్నారు.పిచ్చివాల్లై పోయారు
అసలే కోరికలతో రగిలే ఆ కుర్రకుంకల
కళ్ళన్నీ ఆ బూతుబొమ్మ...మీదనే
అది విద్యార్దుల తప్పు కాదు...
నిద్రలేచింది మొదలు పిల్లలు
చేసేపనిని, వెళ్ళేచోటును, కలిసేమిత్రుల్ని
నెట్లోచూసే బొమ్మల్ని,గమనించని,
నిఘాపెట్టని, తప్పనిచెప్పని, తల్లీదండ్రులదే
పిల్లలు చెడిపోయిన తర్వాత
ప్రేమలో పడిపోయిన తర్వాత
పీకలదాకా మునిగిపోయిన తర్వాత
తిట్టి,కొట్టి,ఇంటినుండి గెంటి,లాభమేంటి ?
అందమైన ఆ బూతుబొమ్మలె మీ
బంగారు బ్రతుకుల్నిఅంధకారం చేస్తాయని
వారికి తెలియజెప్పవలసిన బాధ్యత
ఇంటి పెద్దదే కాదు, ఇంటిలోవుండే ప్రతిఒక్కరిది
ఔను పుస్తకపఠనమే ఉత్తమం కారణం
భగవద్గీత ఓపెన్ చేస్తే భగవద్గీతనే చదువుతారు
బైబిల్ ని ఓపెన్ చేస్తే బైబిల్నేచదువుతారు
అందుకే ఆన్లైన్లో పాఠాలు వినే విద్యార్థులారా!
పాఠాలు బోధించే ఓ పంతుల్లారా! జాగ్రత్త!
మీ కళ్ళు జాగ్రత్త ! ...మీ సెల్లు జాగ్రత్త !
మీ ఒళ్ళు జాగ్రత్త.!..మీ మనసు జాగ్రత్త !



