దొంగెవరు?
చెరువుగట్టు చేరి
ఓ కొంగ ఆకలేసి
పాపం చేపపిల్లలకోసం
ఒంగీ...ఒంగీ...తిరుగుతూవుంటే
నీటిలో...
తొంగీ...తొంగీ...చూస్తూవుంటే
అందరూ ఆ కొంగను
దొంగా... దొంగా... అన్నారు
నిజానికి ఆ కొంగను పుట్టించింది
చెరువులోని చేపల్ను పుట్టించింది
ఆ పరమాత్మే.....
కొంగకు తిండి చెరువులో చేపలే
అది దైవ నిర్ణయమే...
ఆకలి తీరాలంటే చేపలు తినాలే
అది ప్రకృతి ధర్మమే...
మరి కొంగ దొంగ ఎలా ఔతుంది?
కానీ ఓ మనిషీ!
నీ ఆహారం చేపలు కాదు కానీ
నీవు ఏ నదిలోనో... ఏ చెరువులోనో
ఏ గాలాన్ని వేసో...ఏ వలల్ని విసిరో
స్వేచ్చగా తిరిగే చేపల్ని పట్టుకుంటావ్
కమ్మగా కూరవండుకుని లొట్టలేసుకుతింటావ్
నీమనస్సాక్షి నడుగు ఎవరు దొంగ నీవా కొంగా?



