ఎరక్కపోయి వెళ్ళి ఇరుక్కుపోయిన రోజా!

 

సినీ నటి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా ఎరక్కపోయి ఒక కార్యక్రమానికి వెళ్ళి ఇరుక్కుపోయింది. ఇంతకీ జరిగిందేంటంటే, నగరి మునిసిపల్ కార్యాలయంలో జరిగే ఒక కార్యక్రమానికి రోజా వెళ్ళింది. అప్పటికే అక్కడ తెలుగుదేశం, వైసీపీ మునిసిపల్ కౌన్సిలర్లు ఏదో అంశం మీద ఆందోళన కార్యక్రమం, ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ సమయంలోనే అక్కడకి వెళ్ళిన రోజాని కొంతమంది కౌన్సిలర్లు నిర్బంధించారు. దాంతో రోజా ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాను దేవుడా అనుకున్నారు. ఆ తర్వాత శాంతించిన కౌన్సిలర్లు రోజాని విడిచిపెట్టేశార్లెండి.