జగన్ అడుగుపెట్టాడు.. ప్రాబ్లం సాల్వ్

 

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వల్ల చంద్రబాబుకి అప్పుడప్పుడు సమస్యలు తలెత్తుతాయేమో కానీ.. ఇప్పుడు అదే జగన్ వల్ల సమస్య తీరింది.  అదేంటనుకుంటున్నారా.. విశాఖ జిల్లాలోని అచ్యుతాపురం సెజ్ బ్రాండెక్స్ కార్మికుల గత 20 రోజులుగా తమకు కనీస వేతనాలు ఇవ్వాలని.. పీఎఫ్ బకాయిలు చెల్లించాలని ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. వేలాది మంది కార్మికులు విడతల వారీగా చేస్తున్న ఆందోళనలతో సెజ్ మొత్తం నిరసనలతో హోరెత్తుతోంది. అయితే ఏపీ ప్రభుత్వం సమస్యను పరిష్కరిస్తామని.. కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శ్రీలంకకు చెందిన సదరు కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపారు. కానీ దానికి తగిన చర్యలు మాత్రం ఇంత వరకూ తీసుకోలేదు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి.. వారికి మద్దతు తెలిపి.. కార్మికులకు సంఘీభావం తెలుపడానికి విశాఖకు వెళ్లారు. అయితే జగన్ అలా వెళ్లాడో లేదో.. ఇప్పటివరకూ పెద్దగా స్పందించని ప్రభుత్వం.. వెంటనే కార్మికులు కోరినట్టు బ్రాండెక్స్ లో కనీస వేతనాల అమలు కోసం ఓ ప్రత్యేక కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించింది. మొత్తానికి ప్రతిపక్ష నేతకి అధికార పక్షం కాస్త భయపడుతున్నట్టే తెలుస్తోంది..

Online Jyotish
Tone Academy
KidsOne Telugu