కాలు విరిగిన వైసీపీ ఎమ్మెల్యే..

 


వైసీపీ ఎమ్మెల్యే  గిడ్డి ఈశ్వరి ప్రమాదానికి గురయ్యారు. మొన్నటి వరకూ  నంద్యాల ఉప ఎన్నికలో ప్రచారంలో జోరుగా పాల్గొన్న ఆమె ఇప్పుడు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడికి వెళ్లారు. ఈ నేపథ్యంలో కాకినాడలో ఆమె బసచేసిన భవనంలో మెట్లు దిగుతుండగా, కాలు జారి పడిపోయారు. దీంతో కాలుకు తీవ్ర గాయమైంది. చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లిన ఆమెకు ఎక్స్ రే తీయగా ఎడమ కాలులోని ఎముక విరిగినట్టు తేలింది.