అందుకే టీడీపీలో చేరా.. ఎమ్మెల్యే చాంద్ బాషా


వైసీపీ కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కదిరి నియోజక వర్గం అభివృద్ధికి చంద్రబాబు కృషిచేస్తానని హామి ఇచ్చారు.. కదిరి అభివృద్ది కోసమే టీడీపీలో చేరానని అన్నారు. అంతేకాదు ఏపీ అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమవుతుందని.. మైనారిటీల అభివృద్ధికి త‌న‌ వంతు కృషి చేస్తాన‌ని చాంద్‌బాషా చెప్పారు. కాగా ఇప్పటికి వైసీపీ నుండి టీడీపీలోకి 12 ఎమ్మెల్యేలు ఇప్పుడు చాంద్ బాషాతో ఈసంఖ్య 13కి చేరింది. ఇదిలా ఉండగా మరో 25 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతారు అని టీడీపీ నేతలు ప్రకటించడంతో వైసీపీ పరిస్థితి అయోమయంలో పడింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu