జగన్ కు కౌంటర్ ఇచ్చిన సోమిరెడ్డి..

విజయవాడ, కృష్ణలంకలో కల్తీ మందు తాగి పలువురు మృతి చెందిన విషయం తెలసిందే. అయితే చాలా రోజులుగా సైలెంట్ గా ఉన్న జగన్ ఇప్పుడు దొరికిందే ఛాన్స్ గా ఈ విషయంపై అధికార పార్టీపై విమర్శలు చేశారు. అయితే జగన్ చేసిన వ్యాఖ్యలకు గాను టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. జగన్ కు కౌంటర్ ఇచ్చారు. కల్తీ మందు గురించి జగన్ మాట్లాడుతుంటే చాలా హ్యాస్యాస్పదంగా ఉంది.. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మందు ఏరులై పారేదని విమర్శించారు. అంతేకాదు మద్యం వ్యాపారులను తన పార్టీలోనే ఉంచుకొని ఇతరులను విమర్శించడం తగదని.. తన పార్టీలో ఉన్న బొత్స సత్యనారాయణకు అయిదు జిల్లాల్లో మద్యం వ్యాపారం ఉందని.. గతంలో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారని.. మరి అలాంటి ఆయనను పార్టీలోకి ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. ఇప్పటికీ బొత్సపై కేసులు నడుస్తున్నాయని అన్నారు. అసలు ఇన్ని మాట్లాడుతున్నా జగన్ దీనంతటి కారణమైన మల్లాది విష్ణువు గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మరి సోమిరెడ్డి కౌంటర్ కి వైసీపీ నేతలు ఎవరైనా స్పందిస్తారా.. లేక ఎందుకులే అని ఊరుకుంటారా?

Online Jyotish
Tone Academy
KidsOne Telugu