తెరాస అభ్యర్ధిగా పసునూరి దయాకర్ పేరు ఖరారు

 

వరంగల్ ఉప ఎన్నికలకు మిగిలిన అన్ని పార్టీల కంటే ముందుగా తెరాస తన అభ్యర్ధిని ఖరారు చేసింది. తెరాస ఆవిర్భవించినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలలో, తెలంగాణా ఉద్యమాలలో ఆయన చాలా చురుకుగా పాల్గొన్నారు. గతంలో ఆయన యువజన విభాగం వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మొదట రవికుమార్ పేరు ప్రతిపాదించారు. అయితే ఆయన కులం విషయంలో కొన్ని సందేహాలు ఉండటంతో ఆయన స్థానంలో పసునూరి దయాకర్ పేరు ఖరారు చేసారు. పసునూరి దయాకర్ ని తెరాస అభ్యర్ధిగా రేపు కేసీఆర్ ప్రకటించవచ్చునని సమాచారం. వరంగల్ లోక్ సభ నియోజక వర్గానికి ఉప ఎన్నికలు వచ్చే నెల 21వ తేదీన జరుగుతాయి. 24వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu