లోకేష్ వర్సెస్ వంశీ.. సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం!

వల్లభనేని వంశీ టీడీపీని వదలి వెళ్లిన సమయం నుండి వంశీ మరియు లోకేష్ ఒకరి పై ఒకరు సోషల్ మీడియా వేదికగా తెగ పొస్ట్ లు పెడుతున్నారు. మీడియాను ఆసరాగా చేసుకొని ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ సెన్సేషనల్ గా మారారు.టీడీపీ యువనేత నారా లోకేష్ ఫేస్ బుక్ లో పెట్టిన వీడియో హాట్ టాఫిక్ గా మారింది. టిడిపి ఎమ్మెల్యేలను సంతలో గొర్రెల్లా కొన్నారంటూ వల్లభనేని వంశీ, మద్దాళి గిరి, పోతుల సునీత తదితరుల ఫోటోలతో ఉన్న వీడియోను లోకేష్ పోస్ట్ చేశారు. 

నాడు వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపిలోకి వెళ్లినప్పుడు సంతలో గొర్రెల్లా తమ ఎమ్మెల్యేను తెలుగుదేశం పార్టీ కొనిందని జగన్ ఆరోపించారు. ఆయన మాటలనే ప్రస్తావిస్తూ వీరి ఫోటోను జత చేసేన లోకేష్ గొర్రెలతో పాటు గొర్రెల డాక్టర్ ను కొన్నారంటూ కామెంట్లు కూడా చేశారు.దీని పై వల్లభనేని వంశీ ఘాటుగా స్పందిస్తూ వద్దంటే వెళ్లి మంగళగిరిలో పోటీ చేసి చిత్తుగా ఓడారని ఎద్దెవా చేశారు.మండలి కూడా రద్దు కావడంతో లోకేష్ కు పిచ్చి పట్టి కామెంట్లు చేస్తున్నారని వంశీ విమర్శించారు. గొర్రెలకే కాదు పిచ్చి కుక్కలకు తన దగ్గర వైద్యం ఉందని వంశీ జోడించారు. మితి మీరుతున్న వీరి కామెంట్లు ,పోస్టల పై నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.