గుండె పగిలిపోయిందంటున్న కోహ్లీ..

విరాట్ కోహ్లి, అనుష్క శర్మల ప్రేమాయణం గురించి తెలియని వారుండరూ. ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని వెళ్లి తిరిగొచ్చేస్తుంటారు. అలాంటిది ఇప్పుడు వీరి ఊసే ఎక్కడా వినిపించడం లేదు. ఇక వీరిద్దరి బంధం తెగిపోయింది.. బ్రేకప్ చెప్పేసుకున్నారు అని పలు వార్తలు వచ్చినా వారిద్దరి నుండి మాత్రం ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. అయితే ఇప్పుడు కోహ్లి చేసిన ఒక పోస్ట్ ద్వారా మాత్రం  వీరిద్దరూ విడిపోయారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. విరాట్ కోహ్లీ తన గుండె పగిలిపోయింది అంటూ ఒక ఫొటోని పోస్ట్ చేశాడు. అయితే కొంత సేపటికి దాన్ని డిలీట్ చేశాడు. మళ్లీ ఏమనుకున్నాడో ఏమో.. నేను బాధతో ఉన్న చిత్రాన్ని డిలీట్ చేయడాన్ని నేరంగా పరిగణిస్తున్నా.. నన్ను క్షమించండి అంటూ ఆ ఫొటోని మళ్లీ పోస్ట్ చేశాడు. ఇదిలా ఉండగా కొహ్లీ ఈ ఫొటో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఎనభై వేలకు పైగా లైక్స్ రెండు వేలకు పైగా కామెంట్స్ రావడం గమనార్హం. మరి ఇంతకీ కొహ్లీ బాధ అనుష్క గురించేనా.. లేక ఇంకేదైనా ఉందా..!