నడుస్తున్న వ్యక్తులపై దూసుకెళ్లిన కారు..

చెన్నైలో ఒక ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న ఒక కారు రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నవ్యక్తులపై దూసుకుంటూ వెళ్లింది. వివరాల ప్రకారం చెన్నైలోని ఎరుపు రంగు శాంట్రో కారు రోడ్డు వెళుతున్నఐదుగురు వ్యక్తులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. అయితే ఈ ఘటన మొత్తం  సీసీటీవీ పుటేజీలో రికార్డవడంతో ఆ కారు బ్యాంక్‌ ఉద్యోగి వెంకటేష్‌గా గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీనియర్‌ పోలీసు అధికారి జవహర్‌ మాట్లాడుతూ ఈ ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్‌ మద్యం సేవించి లేడని.. అతనికి డ్రైవింగ్‌లో అనుభవం కూడా ఉందని తెలిపారు.