ఆ రెండు రోజులూ శ్రీవారి బ్రేక్ దర్శనాలు రద్దు
posted on Jul 7, 2025 5:27AM
.webp)
తిరుమల లో ఈ నెల 15, 16 తేదీలలో శ్రీవారి బ్రేక్ దర్శనాలు ఉండవు. ఆ రెండు రోజులూ శ్రీవారి బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో తెలిపింది. జులై 16న శ్రీవారి ఇలయంలో ఆణివారం ఆస్థానం నిర్వహించనున్నట్లు పేర్కొన్న టీటీడీ.. అంతకు ముందు రోజు అంటే జులై 15న కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఈ కారణంగా ఆ రెండు రోజులూ శ్రీవారి బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. అదే విధంగా జులై 14న కూడా ప్రొటోకాల్ వినా.. వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫారసు లేఖలను స్వీకరించబోమని స్పష్టం చేసింది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమల పర్యటనను ప్లాన్ చేసుకోవాలని కోరింది.