వీలుంటే సూర్యుడిపై కేసు పెడతారు.. వెంకయ్య కామెంట్

 

ప్రత్యేక హోదాపై ఏపీ కాంగ్రెస్ నేతలు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబులపై కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై వెంకయ్యనాయుడు స్పందించి వైసీపీ నేతలపై వ్యంగ్యస్త్రాలు విసిరారు. ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని మామీద కేసులు పెట్టారు.. వీలుంటే రాష్ట్రంలో వర్షాలు కురవడం లేదు అందుకు సూర్యుడే కారణమంటూ ఆయన మీద కేసులు పెట్టగలరు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.  పార్టీ ప్రయోజనాల కోసమే రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో పెట్టక పోవడంతో సాంకేతికపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఇదంతా కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసమే  చేస్తోందని మండిపడ్డారు.


ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ నేతలు మోడీ, వెంకయ్య, చంద్రబాబులపై ఫిర్యాదు చేస్తే దానికి ప్రతిగా బిజెపి నేతలు కూడా కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు చేశారు. ఒకటిగా ఉన్న రాష్ట్రాన్ని స్వార్థ రాజకీయాలకోసం అడ్డగోలుగా విభజించారంటూ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, రఘువీరా రెడ్డిలపై కడప జిల్లా పోలీస్ స్టేషన్‌లో బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.