ఈదురుగాలులకు ట్యాంకర్ బోల్తా..

బంగాళాఖాతంలో ఏర్పడిన వార్ధా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు చిగురుటాకులా వణికిపోతున్నాయి. తుఫాను కారణంగా గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ గాలుల తాకిడికి నెల్లూరు జిల్లా సూళ్లురుపేట వద్ద ఓ ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ట్యాంకర్ వద్ద నుంచి చమురు వృథాగా పోతోంది. బిజీగా ఉండే జాతీయ రహదారి కావడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu