రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో విత్తమంత్రి భేటీ

కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం (ఫిబ్రవరి 1) లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. వరుసగా ఎనిమిదోసారి ఆమె బడ్జెట్ ప్రవేశ పెట్టడం విశేషం. అయితే ఈ సార గతంలోలా కాకుండా ఆమె బడ్జెట్ ను లెడ్జర్ ఖాతాల ద్వారా కాకుండా ట్యాబ్ ద్వారా ప్రవేశ పెడతారు.

ఇప్పటికే బడ్జెట్ కాపీలు పార్లమెంటు భవనానికి చేరుకున్నాయి. ఇలా ఉండగా కేంద్ర విత్తమంత్రి నిర్మలాసీతారామన్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాష్ట్రపతి భవన్ కు చేరుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అనుమతి తీసుకున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu