పోలవరం బాధ్యత నాదే.. ఉమాభారతి

 

లోక్ సభలో పోలవరం ప్రాజెక్టుపై ప్రశ్నోత్తరాలు జరిగాయి. ఈ సందర్భంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పూర్తి బాధ్యత తనదేనని, ప్రాజెక్టును నిర్దిస్ట సమయంలో పూర్తి చేస్తామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కాబట్టి ప్రత్యేకంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టు గురించి తానే స్వయంగా నీతిఆయాగ్ కు వెళ్లి చర్చించామని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కోరుకుంటుందని అన్నారు. ఈ ప్రాజెక్టు పై మహబూబాబాద్ ఎంపీ ప్రొఫెసర్, కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు 1864 నాటి చట్టం ప్రకారం కాకుండా 2013 తరువాత వచ్చిన భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని కోరారు. దీనికి ఉమాభారతి సమాధానమిస్తూ నిర్వాసితులకు మేలు చేకూర్చేందుకు విధంగానే అన్ని రకాల చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu