ఆరో తరగతి అమ్మాయిలు అదృశ్యం

 

హైదరాబాద్‌ భరత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు స్కూలులో ఆరో తరగతి చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు అదృశ్యమయ్యారు. సనత్‌నగర్ ప్రాంతానికి చెందిన కోనేరు తన్మయి (12), కె.శోభ (13) భరత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నారు. గురువారం మధ్యాహ్నం స్కూలు నుంచి ఇంటికి లంచ్‌కి వెళ్ళిన ఈ ఇద్దరు విద్యార్థినులు అటు ఇళ్ళకు వెళ్ళలేదు.. స్కూలుకీ తిరిగి రాలేదు. దాంతో విద్యార్థినుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.