టీటీడీ రమణదీక్షితుల వేటుపై సుప్రీంకోర్టుకు సుబ్రమణ్యస్వామి

 

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై ఆరోపణలు చేసిన రమణదీక్షితులను తొలగించడంపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సుప్రీంకోర్టుకు వెళతామని స్పష్టం చేశారు.  టీటీడీలో ఆర్థిక అవకతవకలు, నిధుల దుర్వినియోగంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన ట్విట్టర్‌లో స్పందించారు.