మెదక్ టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి

 

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ రాజీనామాతో ఉప ఎన్నిక జరుగనున్న మెదక్‌ లోక్సభ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్‌రెడ్డి పేరు ఖరారు చేశారు. పార్టీ నాయకులతో తీవ్రంగా చర్చించిన తర్వాత తర్వాత ప్రభాకర్‌రెడ్డి పేరును టీఆర్ఎస్ ప్రకటించింది. బుధవారం ఉదయం మెదక్ జిల్లా హెడ్ క్వార్టర్ సంగారెడ్డిలో కొత్త ప్రభాకర్‌ రెడ్డి నామినేషన్‌ వేయనున్నారు. మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి ఉద్యోగ సంఘం నాయకుడు దేవీప్రసాద్‌తోపాటు కె.భూపాల్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి పరిశీలనకు వచ్చినా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రభాకర్‌రెడ్డివైపే మొగ్గు చూపారు.దుబ్బాక నియోజకవర్గానికి చెందిన ప్రభాకర్‌రెడ్డి గత ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యే పోటీ చేయాలని భావించినా టికెట్ దక్కలేదు. ఇప్పుడు ఏకంగా ఎంపీ టిక్కెట్ దక్కించుకోవడం విశేషం. సెప్టెంబర్ 13న మెదక్ ఉప ఎన్నిక జరగనుంది. ఉద్యమ సమయంలో ప్రభాకర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌కు వెన్నుదన్నుగా నిలిచారు.