త్రయంబకేశ్వరాలయం.. మహిళలకూ అనుమతి..

 

ఆలయ ప్రవేశాలపై మహిళలు పోరాటం చేస్తున్న నేపథ్యంలో వారి పోరాటాలు బాగానే ఫలిస్తున్నాయి. ఇప్పటికే శనిసింగనాపూర్ ఆలయంలో ప్రవేశానికి మహిళా సంఘాలు పోరాటం చేసి ప్రవేశం కల్పించుకున్నారు. ఇప్పుడు తాజాగా త్రయంబకేశ్వరాలయంలోకి కూడా మహిళలకు అనుమతి లభించింది. ఇప్పటికే గర్భగుడిలోకి పురుషులకు అనుమతి ఇవ్వగా.. ఇప్పుడు మహిళలకు కూడా అనుమతిస్తున్నట్టు ట్రస్టు సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకూ ఒక గంటపాటు పురుషులకు, మహిళలకు గర్భగుడిలో ప్రవేశించడానికి అనుమతినిచ్చారు.