కజిరంగా పార్క్‌లో రాయల్ బెంగాల్ టైగర్ మృతి!

అసోం రాష్ట్రంలోని కజిరంగా జాతీయ వనంలో అరుదైన రాయల్ బెంగాల్ టైగర్ కళేబరం వెలుగుచూసింది. కజిరంగా జాతీయ వనంలోని బగోరి రేంజ్ లో పులి కళేబరాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పులి కళేబరానికి పశువైద్యాధికారులు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ పులి ఏడు రోజుల క్రితం మరణించి ఉంటుందని పశువైద్యులు తేల్చారు. 

ఈ ఏడాది కజిరంగా జాతీయ వనంలో ఒక పులి మరణించింది. మళ్లీ రెండో పులి మరణించింది. ఈ పులి కళేబరం వద్ద ఏకే 47 రైఫిల్ తూటాలు లభించాయి. దీంతో వేటగాళ్లు ఈ పులిని చంపి ఉంటారని అటవీశాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ జాతీయ వనంలో 121 రాయల్ బెంగాల్ పులులున్నాయి. వీటితోపాటు కొమ్ములున్న ఖడ్గమృగాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. దీంతో పులులు, ఖడ్గమృగాలకు మధ్య దాడులు కొనసాగుతుంటాయి. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో కజిరంగా జాతీయ వనంలో సందర్శకులను నిలిపివేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News