జర్మనీపై మరో ఉగ్రదాడి..

నాలుగు రోజుల క్రితం జరిగిన ఉగ్రదాడి నుంచి తెరుకోకముందే జర్మనీపై ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. బెర్లిన్‌లో సిరియా శరణార్థి ఒకరు బాంబు దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో దీనికి కారణమైన వ్యక్తి మరణించగా..మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి 10 గంటల సమయంలో ఓ బార్ ప్రాంగణంలో జరుగుతున్న పాప్ మ్యూజిక్ ఫెస్టివల్‌ లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఫెస్టివల్‌ ప్రాంగణాన్ని ఖాళీ చేయించి 2,500 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.