తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల..

 

నేడు తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఫలితాలు విడుదలచేశారు. పరీక్షలు జరిగిన నెలరోజుల్లోనే ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 5, 19, 494 మంది హాజరయ్యారు. ఈ పరీక్షల్లో మొత్తం 85.63 శాతం ఉత్తీర్ణత సాధించగా..బాలురు 84.90 ఉత్తీర్ణత, బాలికలు 86.57 ఉత్తీర్ణత సాధించారు. కాగా ఈ పరీక్షల్లో వరంగల్ జిల్లా 95.13 శాతం సాధించి ప్రధమ స్థానంలో ఉండగా.. హైదరాబాద్ జిల్లా 76.23 శాతంతో చివరి స్థానంలో నిలిచింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu