టీడీపీ నేతపై టీఆర్ఎస్ ఎంపీ కూతురు దాడి...!


అధికారం పార్టీలో ఉన్న ఓ ఎంపీ కూతురునని ఓ యువతి ప్రతిపక్షపార్టీ నేతపై దాడికి దిగిన ఘటన ఇప్పుడు తెలంగాణలో రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. ఈ విచిత్రమైన ఘటనకు  సిటీ సెంటర్‌ మాల్‌ వేదికైంది. అసలు ఆకథంటే తెలుసుకోవాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే. ఏపీ అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం కార్యాలయం కార్యదర్శి సురేష్‌ (50), ఆయన భార్య భాను (44)లపై హైదరాబాద్, బంజారాహిల్స్‌, రోడ్ నెంబర్ 1లో ఉన్న సిటీ సెంటర్‌ మాల్‌  లో షాపింగ్ కు దిగారు. అయితే అక్కడ  ఓ యువతి వీరిని ఢీకొట్టి లిఫ్ట్‌ లోకి ప్రవేశించింది. అంతటితో ఊరుకోకుండా, కళ్లు కనిపించట్లేదా? అంటూ రెచ్చిపోయింది. సెక్యూరిటీ గార్డులు, షాపింగ్ కు వచ్చిన ఇతర కస్టమర్లు వారిస్తున్నా వినలేదు. తాను ఎంపీ కూతురిని, గన్‌ మెన్‌ లను పిలుస్తున్నానని, కాల్చేస్తానని నానా హంగామా చేసింది. బాధితులు భయంతో వెళ్లిపోతుంటే, వారిని మరోసారి కారు దగ్గర అటకాయించి దాడికి దిగింది. చివరికి సెక్యూరిటీ గార్డుల సాయంతో వారిద్దరూ తప్పించుకుని పోలీసులను ఆశ్రయించారు. ఇంతకీ ఆమె ఎవరో తెలియక బాధితులు.. ఆమె వేసుకొచ్చిన కారు నెంబర్ ను నోట్ చేసుకొని పోలీసులకు ఇచ్చారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె ఎవరో కనిపెట్టే పనిలో పడ్డారు.