తెలంగాణ జేఏసి ప్రజాకోర్టు

 

telangana news, kodandaram t jac, kodandaram telangana issue

 

 

ప్రత్యేక తెలంగాణ అంశంపై ఢిల్లీలో కీలక చర్చలు జరుతున్నాయని వార్తలు వస్తున్న నేపధ్యంలో తెలంగాణ జేఏసి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జూన్ 29న మాసబ్‌ట్యాంక్‌లో ప్రజా కోర్టును నిర్వహించనున్నామని కోదండరామ్‌ చెప్పారు. జూలై 4, 5 తేదిల్లో ఢిల్లీలో జాతీయ పార్టీలతో కలిసి తెలంగాణపై జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు కూడా ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్ని రకాలుగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీల ఆశ చూపి తెలంగాణ రాష్ట్ర ఏర్పా టును పక్కకు పెట్టాలని చూస్తోందని, ఎటువంటి ప్యాకేజీలకు ఒప్పు కొనేది ప్రశ్నే లేదని, హైదరాబాద్ తో కూడిన పది జిల్లాల తెలంగాణకు మాత్రమే తాము అంగీకరిస్తామని, రాయల తెలంగాణకో, ప్రత్యేక ప్యాకేజీలకో ఒప్పుకునే సమస్యలేదని స్పష్టంచేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News